ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ ఢల్లీికి ఎందుకు వెళ్తున్నారంటూ లోకేష్ మంగళవారం ట్విట్ చేశారు. ట్విట్టర్లో నాలుగు ఆప్షన్స్ ఇచ్చి పోల్ పెట్టారు.దీంతో, లోకేష్ కామెంట్స్కు అనుకూలంగా టీడీపీ కార్యకర్తలు, వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబు దిల్లీకి ఎందుకు వెళ్లారంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అలాగే, కొన్ని వీడియోలు షేర్ చేస్తున్నారు. దీంతో లోకేష్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.