Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీఎం జేబులో నుంచి తీసి ఇస్తున్నారా? : రఘురామ

ప్రభుత్వం ఖర్చుతో ఇష్టానుసారంగా పార్టీ పేరు మీద ప్రకటనలు ఇస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ముఖ్యమంత్రి జేబులో నుంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రం కూడా నిధులు ఇస్తోందని, మరి జగనన్న పేరు ఏంటని ప్రశ్నించారు. సమాచార శాఖ కార్యదర్శికి అసలు బుద్ధి ఉందా? అని అన్నారు. ్డ బెయిల్‌పై ఉండి రెండున్నరేళ్ల నుంచి కోర్టుకు రావడం లేదన్నారు. ఏదో ఒక కారణంతో సినిమా థియేటర్లు మూసి వేస్తున్నారని,సినిమా సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img