సచివాలయంలో చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. . ఈ సమావేశానికి జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్రావత్లు హాజరయ్యారు.సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై చర్చించారు. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందన బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, గతనెల 29న చీఫ్సెక్రటరీ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ అయ్యారు.