Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసిన వర్ల రామయ్య


వివేకా హత్య కేసు నిందితుల ప్రాణాల భద్రత దృష్ట్యా కడప కేంద్ర కారాగారం జైలర్‌ వరుణారెడ్డిని బదిలీ చేయాలంటూ సీబీఐ డైరక్టర్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. వరుణారెడ్డిని బదిలీ చేయని పక్షంలో నిందితులను మరో జైలుకు పంపాలని విన్నవించారు. గతంలో అనంతపురం జిల్లా జైలర్‌ గా వరుణారెడ్డి పని చేసిన సమయంలోనే.. జైలు గదిలో మొద్దు శీను హత్యకు గురయ్యారని తెలిపారు. వరుణారెడ్డి పని చేసిన ప్రతి చోట నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. వివేకా హత్య కేసు నిందితుల రక్షణ దృష్ట్యా బదిలీ చేయాలని వర్ల రామయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img