కందుకూరు ఘటనలో 8మంది మృతిచెందడం బాధాకరం అంటూనే ’’ఒకపక్క సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతే, అందరూ ఇక్కడే ఉన్నండి సభ కొనసాగిస్తా అని చెప్పిన చంద్రబాబులో అధికారంలోకి రావాలన్న తన ఆరాటం కనిపిస్తుంది ’’ అని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పుంగనూరులో గడప గడపకు మన ప్రభుత్వం పర్యటనలో ఉన్న ఆయన గురువారం కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మరణించిన ఘటనపై స్పందించారు. ఆ ఘటనలో 8 మంది చనిపోవడం దురదృష్టం, ప్రభుత్వం తరపున చింతిస్తున్నామన్నారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. ఇరుకైన సందుల్లో, చిన్న చిన్న జంక్షన్లలో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు.