ఏఐటీయూసీ నేతలు రావుల, ఓబులేశు డిమాండ్
కడప : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టినా, ఏ అభివృద్ధి పథకాన్ని అమలు చేసినా విజయవంతం చేసేది స్కీం వర్కర్లే. పగలనక, రాత్రనక కష్టపడితేనే అవి లబ్ధిదారులకు అంది, ప్రభుత్వాలకు మంచి పేరు తేస్తున్న స్కీం వర్కర్ల జీవితాలు మారడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేశు ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 24న దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక నూర్జహాన్ కళ్యాణమండపంలో స్కీమ్ వర్కర్ల రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు రాలు లలితమ్మ, ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతమ్మ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్, యానిమేటర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధు లుగా హాజరైన ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు రావులపల్లి రవీంద్రనాథ్, జి.ఓబు లేశు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో స్కీం వర్కర్లకు యేటా నిధులు కుదిస్తు న్నాయని, కనీస వేతనాల అమలుకు నోచు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన జాతీయ విద్యా విధానం పేరట ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయడానికి పూను కుంటున్నా యన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన నూతన విద్యా విధానం పిల్లల మానసిక ఎదుగు దలకు దోహదపడదని చెప్పారు. ప్రభుత్వాలు వెంటనే ఈ విధానాన్ని విరమించు కుని అంగన్ వాడీ కేంద్రాల్లోనే ప్రీస్కూల్ కొనసాగించాలని కోరారు. స్కీం కార్మికుల అయిన ఆశ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించకపోయినా కనీసం కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లపై రాజకీయ జోక్యం అరికట్టి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సెప్టెంబర్ 24న దేశ వ్యాప్త స్కీం కార్మికుల సమ్మెను రాష్ట్రంలో జయప్రదం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల, జిల్లా అధ్యక్షురాలు చెన్నమ్మ, నాయకురాలు సరోజమ్మ, ఏఐటీ యుసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. వేణుగోపాల్, ఎల్. నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసీ బాదుల్లా, జిల్లా కార్యదర్శి ఉద్దే మద్దిలేటి ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుభాషిని, అయ్యవారమ్మ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చాంద్ బాష, నాయకు రాలు మేరి, కామాక్షి, సులోచన పాల్గొన్నారు.