Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్కూల్‌ జోన్స్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్స్‌ ఏర్పాటు చేయాలి- ఏ.ఐ.ఎస్‌.ఎఫ్‌

విశాలాంధ్ర – ఆదోని : ఆదోని నుండి ఎమ్మిగనూరుకి వెళ్లే తాలూకా పోలీస్టేషన్‌ ప్రధాన రహదారిలో స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి షాబిర్‌ బాషా డిమాండ్‌ చేశారు. శుక్రవారం రోడ్డు రవాణా కార్య నిర్వాహక ఇంజనీర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి షాబీర్‌ భాష మాట్లాడుతూ స్కూల్‌ జోన్‌ ఉన్న ప్రధాన రహదారిలో ప్రతి చోట స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, స్కూలు సమయాల్లో విద్యార్థి విద్యార్థినీలు, చిన్న పిల్లలు రోడ్డు దాటే సమయంలో ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళుతున్నాయని ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తక్షణమే స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్ట్స్‌ అండ్‌ సెన్స్‌ కళాశాల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు, జీబ్రా లైన్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ డివిజన్‌ నాయకులు శివప్రసాద్‌ రెడ్డి, వీరేష్‌, మల్లికార్జున, రంగా,ప్రవీణ్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img