Friday, April 19, 2024
Friday, April 19, 2024

స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తీవ్రత కొన్ని జిల్లాల్లో తగ్గినా.. మరికొన్ని జిల్లాల్లో కేసులు మాత్రం పెరుగుతున్నాయి.నిన్నటితో పోల్చితే పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,695 శాంపుల్స్‌ను పరీక్షించగా 2,010 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,59,942కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 1,956 మంది డిశ్చార్జ్‌ అవగా.. ఇప్పటివరకు 19,25,631 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,999గా ఉంది. కరోనాతో ఇవాళ చనిపోయిన 20 మందితో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 13,312 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను పరిక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img