హీరో నాని వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండిరచారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా.. ఇష్టానుసారం రేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. . నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సామాన్యునికి సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ అని.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని వెల్లడిరచారు. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులను సంప్రదించాలి అని సూచించారు.