Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన సాయితేజ గ్రామంలో విషాదఛాయలు

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన సాయితేజ చిత్తూరు జిల్లావాసి. ఆయన మృతితో స్వగ్రామం ఎగువరేగడిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. సాయితేజ నివాసం వద్దకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక పోలీసు అధికారులు సాయితేజ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయానికి సాయి తేజ మృతదేహం గ్రామానికి చేరుకోనుంది. రేపు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అధికార యంత్రాంగం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది. సిక్కిం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న సాయితేజ తమ్ముడు మహేష్‌ బాబు అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img