మాన్సాస్ ట్రస్ట్ వివాదం మరో మలుపు తిరిగింది. అశోక్ గజపతి రాజును ట్రస్ట్ చైర్మన్ గా తొలగించి, తనను నియమించాలని కోరుతూ ఆనంద గజపతి రాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనను, సంచయితను వారసులుగా గుర్తించిందని ఆమె కోర్టుకు విన్నవించారు. సంచయిత కానీ పక్షంలో తనను చైర్మన్గా నియమించాలని ఆమె కోరారు. దీనిపై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.