Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హైకోర్టులో ఆనందయ్య పిటిషన్‌

కరోనా మందు తీసుకొనేందుకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్‌ దాఖలు చేశారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌కి తాను ఆయుర్వేద మందు తయారు చేశానని, పంపిణీకి సిద్ధంగా ఉందని ఇటీవల ఆనందయ్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా వాహనాల్లో కృష్ణపట్నం రావడాన్ని గ్రామస్థులు అడ్డుకున్నారు. కొవిడ్‌ బాధితులు నేరుగా గ్రామంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో హైకోర్టులో ఆనందయ్య పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా మందు తీసుకొనేందుకు వస్తున్న వారిని అడ్డుకుంటున్నారని ఆనందయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు. డివిజన్‌ బెంచ్‌లో విచారణకు సింగిల్‌ జడ్జి సూచించారు. గతంలో ఆనందయ్య మందుపై ధర్మాసనంలో విచారణ జరిగిన విషయాన్ని న్యాయవాదులు గుర్తుచేశారు. దీనితో ప్రధాన న్యాయమూర్తి దగ్గరకి పంపాలని సింగిల్‌ జడ్జి పేర్కొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img