Friday, April 19, 2024
Friday, April 19, 2024

1 నుంచి సీఎం కడప జిల్లా పర్యటన


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పర్యటన ఖరారైంది. రేపు (బుధవారం), ఎల్లుండి(గురువారం) వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో సమావేశమవుతారు.ఆరుగంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.గురువారం దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్‌ సమావేశమవుతారు. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img