సినిమా టికెట్ల పెంపు అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనంపై చర్చించారు. సినిమా టికెట్ల కనిష్ట, గరిష్ట ధరలు సినిమా థియేటర్ల యజమానుల సమస్యలపై చర్చించారు. మరోవైపు ఈ నెల 10న చిరంజీవితోపాటు సినీ పెద్దలు సీఎం జగన్ను కలవనున్నారు. సినీ ప్రముఖులతో చర్చించి టికెట్ ధరలపై సీఎ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడిరది.నెల రోజుల వ్యవధిలో జగన్ తో చిరంజీవి భేటీ కానుండటం ఇది రెండో సారి. జనవరి 13న తాడేపల్లిలోని జగన్ నివాసానికి చిరంజీవి వెళ్లారు. అప్పుడు ఆయన సింగిల్ గానే వెళ్లడం తెలిసిందే. ఈ సారి సమావేశం తర్వాత ఇండస్ట్రీ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.