Friday, April 19, 2024
Friday, April 19, 2024

120మంది మహిళలపై అత్యాచారం.. జిలేబీ బాబాకి 14ఏళ్లు జైలు శిక్ష

ఆయన ఒక బాబా..ఆయన వద్దకు వచ్చే మహిళా భక్తులను లొంగదీసుకుని వారికి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌ మెయిల్‌ కి పాల్పడే వాడట.కాగా 120 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియోలు తీసిన జిలేబీ బాబాకు 14 సంవత్సరాల జైలు శిక్ష ఖరారయ్యింది. హర్యానాలోని ఫతేహాబాద్‌లోని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అలాగే 35 వేల రూపాయిల జరిమానా విధించింది. బాబా అవతారం ఎత్తక ముందు జిలేబీలు అమ్మేవాడు. దీంతో అతడిని జిలేబీ బాబా అనే పేరు వచ్చింది. జూలై 19, 2018న అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 292, 293, 294, 376, 384, 509, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67-ఏ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం 63 సంవత్సరాలు ఉన్న జిలేబీ బాబాపై 2018 లో మొదటి సారిగా అత్యాచారం కేసు నమోదు అయ్యింది. తరువాత అతడిపై పలు అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి కోర్టులో విచారణ సాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img