ఈ నెల 17న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులపై కేబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. డిసెంబర్లో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. . మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.