స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి నేటితో 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. సాయంత్రం క్యాండిల్ ర్యాలీలు చేపట్టనున్నారు. స్టీల్ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష కార్మిక విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద వేలాది మందితో భారీ మానవహారం నిర్వహించారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.