Friday, April 19, 2024
Friday, April 19, 2024

పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్న టీడీపీ

ఈ నెల 28న నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం..తాను వెళ్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన జగన్

ఈ నెల 28న నూతన పార్లమెంట్ భవన సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేమని ఇప్పటికే 19 పార్టీలు స్పష్టం చేశాయి. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ఎలా ప్రారంభోత్సవం చేస్తారని ఆ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ప్రారంభోత్సవానికి హాజరవుతున్నట్టు టీడీపీ తెలిపింది. తెలుగుదేశం తరపున ఆ పార్టీ ఎంపీలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి తాను హాజరవుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ హాజరవుతుందా? లేదా? అనే విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఆ పార్టీ నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img