టీచర్లకు రాష్ట్రంలో బోధన తప్ప మరొక పని చేయబోమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బోధన తప్ప మరొక పని చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని వారం రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల నేతలతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో మార్పులపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉపాధ్యాయ సంఘాలకు వివరించామని చెప్పారు. ఈ సారి 82 వేలకు పైగా ఉపాధ్యాయులు బదిలీలు కోరారని చెప్పారు.అయితే, ఈసారి సుమారు 1,000 మంది ప్రత్యామ్నాయం లేక బదిలీ కాలేకపోయారని మంత్రి బొత్స అన్నారు. 679 మందిని సెకెండ్ ఎమ్ఈవో పోస్టుల్లో నియమించామని తెలిపారు. వారి స్థానాల్లో అర్హులైన స్కూల్ అసిస్టెంట్లను హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామని.. ఇంకా 355 ఎమ్ఈవో 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని మంత్రి బొత్స అన్నారు.రాష్ట్రంలో 679 ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 350 మంది ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా పదోన్నతి కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం 355 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. పాఠశాలల్లో రాత్రి వాచ్మెన్ పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని.. 175 ఇంజినీరింగ్ ప్రొఫెసర్లతో టీచర్లకు సాంకేతిక పరిజ్ఞానం కల్పిస్తామని పేర్కొన్నారు.
98 మంది కంటే తక్కువ సంఖ్య ఉన్న పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేరని.. అందుకే సబ్జెక్టు టీచర్లు లేని చోట విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరోవైపు పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన వారికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 20వ తేదీన (మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విజయవాడలో అభినందన కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.