Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న వంగవీటి రాధా?..

విజయవాడ రాజకీయాల్లో మరో ప్రచారం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాధా త్వరలోనే వివాహం చేసుకబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైనట్లు ప్రచారం జరుగుతోంది.తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకున్నారట.. వధువుది కూడా రాజకీయ కుటుంబం అంటున్నారు. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని.. సెప్టెంబర్ 6న వివాహం జరుగుందని కొందరు అంటుంటే.. అక్టోబర్ నెలలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. విజయవాడలో వివాహం చేసుకుంటారంటున్నారు. అయితే రాధా వివాహంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. చాలా కాలంగా వంగవీటి వంగవీటి రాధా వివాహం చేసుకుంటారని అభిమానులు ఎదురు చూశారు. ఇప్పుడు పెళ్లి వార్తలు రావడంతో వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న రాధా.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అప్పుడప్పుడు అభిమానులు, స్నేహితుల ఆహ్వానం మేరకు కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు. వంగవీటి మోహన రంగా విగ్రహాలను ప్రారంభిస్తున్నారు.

వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.2019 ఎన్నికల ఫలితాల తర్వాత రాధా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం మీడియాకు కనిపించారు. ఆ తర్వాత కొంతకాలానికి పవన్ కళ్యాణ్‌ ను కలవడంతో జనసేన పార్టీ లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అనంతరం ఆయన అమరావతి రైతుల ఉద్యమానికి తనవంతుగా మద్దతు పలికారు. రాధా టీడీపీలోనే ఉన్నారని చెబుతున్నా.. ఆయన మాత్రం పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మాత్రం ఓసారి వెళ్లి మద్దతు తెలిపి వచ్చారు. మొత్తానికి వంగవీటి రాాధా పెళ్లి వార్త మాత్రం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img