మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు వైఎస్ భాస్కర్రెడ్డి, గజ్జల ఉదయ్కుమార్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ను జూన్లో సీబీఐ కోర్టు తిరస్కరించడంతో తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు విచారణ జరిపిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.