Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైతులకు అండగా గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చాం.. జగన్

రైతులకు అండగా నిలిచి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలిపారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా మెగా మేళా ప్రారంభించారు సీఎం జగన్‌. చుట్టుగుంట సెంటర్‌లో రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను సైతం సీఎం జగన్‌ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు.

  • అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూౌ రైతన్నకు అండగా వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ఉందన్నారు. ప్రతీ ఆర్బీకే పరిధిలో తక్కువ ధరకు యంత్ర పనిముట్లు అందజేస్తున్నామ‌న్నారు. ప్రతీ ఆర్బీకేలో అందుబాటులోకి రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు ఉన్నాయన్నారు. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించామ‌న్నారు. ఇ‍ప్పటికే 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలు ఏర్పాటయ్యాయన్నారు. రైతు గ్రూపులకు కొత్తగా రూ.361.29కోట్ల విలువైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లను అందించామ‌న్నారు. ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15లక్షలు కేటాయించామ‌న్నారు. ప్రతీ ఆర్బీకే సెంటర్‌లో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, ఏమి అవసరమో వారినే అడిగి అందజేస్తామ‌న్నారు. అందులో భాగంగానే వైఎస్సార్‌ యంత్ర సేవ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. అక్టోబర్‌లో 7లక్షల మందికి లబ్ధి కలిగేలా యంత్రాలు అందిస్తామ‌న్నారు. రైతులందరికీ మంచి జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ‌న్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img