Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కర్నూలులో దారుణం

. కన్న తండ్రి తో కలిసి కట్టుకున్న భార్యను చంపి … .
. అత్తమామలపై కత్తులతో దాడి..
అక్కడికక్కడే..అత్త మృతి.. మామకు తీవ్ర గాయాలు…

విశాలాంధ్ర – కర్నూలు (రూరల్) : ఒక వ్యక్తి తన కోడలి ఊరికి వెళ్లి… కోడలితోపాటు కోడలి తల్లితండ్రులను మరీ తన ఇంటికి పిలిపించుకొని వారి ముగ్గురిపై హత్యకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలోని కల్లూరు చింతల ముని నగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ సమీపంలో చింతలముని నగర్ కు చెందిన ప్రసాద్ తన కుమారుడు శ్రావణ్ తో కలిసి కోడల్ని కొట్టి చంపి. కోడలి తల్లిదండ్రులపై కత్తులతో దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం ఉదయం 11 గంటలకు పైబడిన సమయంలో చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘటనలో రుక్మిణి(18) రమాదేవి(36)లు దారుణంగా హత్య కాబడ్డారు..వెంకటేశ్వర్లుకుతీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది. చింతల ముని నగర్ కు చెందిన ప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడు శ్రావణ్ కు ఈనెల 1 న తెలంగాణ రాష్ట్రం వనపర్తి కి చెందిన రుక్మిణి తో వివాహం అయ్యింది. ఉదయం వనపర్తి నుంచి రుక్మిణి, తల్లి రమాదేవి , తండ్రి వెంకటేష్ ముగ్గురు కర్నూలు లోని భర్త శ్రావణ్ ఇంటికి వచ్చారు. వచ్చిన కొన్ని గంటల్లోపే గోడవ చోటు చేసుకొంది. ఈఘటనలో రుక్మిణి, రమాదేవి దారుణంగా హత్యకాబడ్డారు. శ్రావణ్ ఐసిఐసి బ్యాంకులో కాల్ సెంటర్ నందు ఉద్యోగం చేస్తున్నారు. తన తండ్రి ప్రసాదు ఇడ్లీ అమ్ముకొని చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తండ్రి ప్రసాద్ తన కుమారుని తో కలిసి కోడల్ని కోడలి తల్లిదండ్రులపై హత్యకు పాల్పడడం ఏంటని స్థానికులు ప్రశ్నించుకోవడం ప్రశ్నార్థకంగా మారింది వివాహము జరిగి కనీసం రెండు వారాలు దాటకముందే ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకోవడం కారణాలు ఏవని.. భర్తకు భార్య పై వచ్చిన అనుమానమా…? లేక మామకు కోడలి కుటుంబ సభ్యులపై కక్ష సాధింపా…? పోలీసుల విచారణలో తెలియాల్సి వుంది. ఏది ఏమైనాప్పటికీ ఈ సంఘటనపై ముఖ్య కారణాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉందననీ స్థానికులు చర్చించుకోవడం చర్చనీయాంశంగా మారింది. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img