వైఎస్సార్ యంత్ర సేవా పథకం-రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళా సందర్భంగా రైతులకు సీఎం జగన్ ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. నేడు గుంటూరులో జరిగిన కార్యక్రమంలో వీటిని రైతులను అందించారు. 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లు, 13,573 వ్యవసాయ పనిముట్లను రైతు గ్రూపులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతులకు ట్రాక్టర్లు, పనిముట్లను సబ్సిడీ ధరలకు అందిస్తున్నట్లు చెప్పారు.