Wednesday, November 19, 2025
Home Blog

కెనాల్ లో పడి ప్రభుత్వ వైద్యుడు మృతి

విశాలాంధ్ర బెళుగుప్ప, : పంపనూరు సమీపంలోని కెనాల్లో ప్రమాదవశాత్తు పడిపోయిన బెళుగుప్ప మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడి మృతదేహం తీవ్ర గాలింపు చర్యల తర్వాత సోమవారం సాయంత్రం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానిక వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు పొలం సర్వే నెంబర్ 543 సమీపంలోని హంద్రీనీవ కాలువ వద్ద డాక్టర్ కార్తీక్ రెడ్డి మృతదేహం కనిపించింది. స్థానిక ప్రజలు మరియు సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని కాలువ నుండి బయటకు తీశారు. వెంటనే బంధువులకు సమాచారం అందించి, వారి సమక్షంలో మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం…

    ఘనంగా సత్యసాయి రథోత్సవం.

    రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు…

    విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.సత్యమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఉత్తర గోపురం వరకు రథాన్ని లాగారు. విశేష ఆకర్షణగా కోలాటాలు, కళా జాతర బృందాలు,కీలుగుర్రాలు , డబ్బు వాయిద్యాలు , మంగళ వాయిద్యాలు, గరగర నృత్యం, పిల్లల వేషధారణ, భక్తులను అబ్బురపరిచాయి. సాయి నామస్మరణలతో పురవీధులు పులకరించాయి.రథోత్సవ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ దంపతులు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్,సవిత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి,ఎమ్మెల్యేలు పల్లె సింధూర, పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ,మాజీ ఎంపీ మురళీ మోహన్ , కేంద్ర నెహ్రూ యువకేంద్రం మాజీ కో ఆర్డినేటర్ సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ,ఎస్పీ సతీష్ కుమార్,సత్యసాయి ట్రస్ట్ సభ్యులు రథాన్ని ముందు కులాలు భక్తిని చాటుకున్నారు.రథోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పుట్టపర్తి పురవీధులలో సాయి భక్తులు బారులు తీరారు.స్వదేశీ విదేశీ భక్తులతో పుట్టపర్తి కిట కిట లాడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబులపతి, సామకోటి ఆదినారాయణ, డిఎస్పి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు

    కుష్టువ్యాధి రాకుండా అవగాహన ఉండాలి

    -జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి

    విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి సూచించారు. కుష్టువ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం రాప్తాడులో పరిశీలించారు. ప్రతి ఆశా కార్యకర్త రోజు కు 20 ఇళ్ల వరకు కుష్టు వ్యాధి సర్వే చేయాలన్నారు. ఇంటి వద్దకు వెళ్లినపుడు ఇంట్లో వారందరికీ స్పర్శ లేని రాగి రంగు మచ్చ లు ఉన్నాయా, కాళ్ళు చేతులు కండరాలతో బలహీనత, కాళ్ళ నుండి చెప్పులు జారిపోవడం, చెవి తమ్మెలు మందంగా మారిపోవడం, కళ్ళు పూర్తిగా మూసుకోలేక పోవడం వంటి ప్రశ్నలు అడిగారు. అనుమానంగా ఉన్న కేసులను పి.హెచ్.సి డాక్టర్ శివకృష్ణ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సిఫారసు చేయాలన్నారు. డాక్టర్ జయలక్ష్మి, పీఎంఓ నాగన్న మొదట పి.హెచ్.సి కి వచ్చి డా.శివకృష్ణతో కుష్టువ్యాధి గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓ రామదాసు, సీహెచ్ఓ శివప్రసాద్, సూపర్వైజర్ అరుణ, ఎంపీహెచ్ఏ నారాయణ స్వామి, ఏఎన్ఎం ఝాన్సీ, ఆశా కార్యకర్తలు గాయత్రి, చంద్రకళ పాల్గొన్నారు.

    అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యే

    విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రగతి పాఠశాలలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, రాబోవు రోజుల్లో పేద ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి అరుణ, కౌన్సిలర్లు విజయ్ కుమార్, మంగపట్నం లక్ష్మీదేవి, కోట సుశీలమ్మ, బోసి అంజనమ్మ, బోసి రామచంద్ర, మున్సిపల్ కమిషనర్ శివ రామకృష్ణ, హౌసింగ్ AE రాజశేఖర్ రెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

    ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం..

    గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
    విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కవి ప్రఫుల్ల చంద్ర, టీటీడీ ధర్మాచార్యులు వెంకటేశులు, కాకుమాని రవీంద్ర గాయకులు నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన కవులు గ్రంథాలయం గురించి ఒక పద్యాన్ని కవిత ద్వారా విద్యార్థులకు వినిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పాటలు గేయాలు,, పద్యాలు, కవితలు, విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రాము, రమణా నాయక్, గంగాధర్, సరస్వతమ్మ, పాఠకులు,55 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

    టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం..

    మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్
    విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీ ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధంగా అయితే మన మూల్యాంకనం చేస్తామో ,అదేవిధంగా టీచ్ టూల్ అనేది ఉపాధ్యాయుల బోధన విద్యార్థులకు సక్రమంగా అందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం టీచ్ టూల్ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. వీటిని ఉపాధ్యాయులు అందరూ కూడా పాఠశాల తరగతి గదిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొనుటకు టీచ్ టూల్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్, జీవి జడ్పీఎస్ ప్రధానోపాధ్యాయులు సుమన, జగదీష్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, సీఎంఆర్టీలు పాల్గొన్నారు.

    త్వరలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం..

    బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్
    విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని లోని కోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని త్వరలో ప్రతిష్టించనున్నామని బలిజ సంక్షేమ సంఘం, బలిజ మహిళా మండలి, బలిజ యూత్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు లోని కోటలో “జయహో శ్రీకృష్ణదేవరాయ” కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం బలిజ సంగం నాయకులు తొండ మాల బాబు మాట్లాడుతూ అప్పటి శ్రీకృష్ణదేవరాయలు ధర్మవరం పట్టణంలో కోట నిర్మించడం జరిగిందని, కాలక్రమమైన ఆ వీధికి లోనికోటగా నామకరణం చేయడం జరిగిందన్నారు. ఆ మహానుభావుని చిరకాలం గుర్తిండిపోయేలా లోని కోట వీధిలోనే వారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. అంతేకాకుండా శ్రీ సత్య సాయి జిల్లాలో గల అన్ని మండలాలలో రాయలవారు పాలించిన వాటిలో కోటలు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటిని పురావస్తు శాఖ అధికారులు గుర్తించి, ప్రభుత్వ అనుమతితో మరమ్మత్తులు చేయించి, పర్యాటక కేంద్రంగా మార్చాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేల్దారి చేన్న రాయుడు, అల్లం మూర్తి ,తోట ప్రసాద్, పెరిమాలి రమాదేవి, ముక్తం కాశి, గోపి రాయల్ తదితరులు పాల్గొన్నారు.

    నృత్య పోటీలలో రాణించిన సూర్యా హై స్కూల్ విద్యార్థిని యామిని

    విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025 పోటీల్లో ప్రతిభ ఘనపరిచి ప్రశంసా పత్రం పొందడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నరేంద్రబాబు, డాన్స్ మాస్టర్ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా కర్రీస్పాండెంట్, డాన్స్ మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు టీఎం యామినీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పాఠశాలలో చదువుతోపాటు క్రీడలు, నృత్యం పై కూడా చక్కటి అవగాహనతో పాటు ప్రాక్టీసులు కూడా చేయబడునని తెలిపారు.

    డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి..

    ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్
    విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివిధ గ్రూపులలో స్పాట్ అడ్మిషన్లు కలవు అని ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ , కళాశాల ఇంచార్జి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మేనేజెంట్ కోటా కింద బిసిఎ, బీబీఏ గ్రూపుల నందు 18 సీట్లు, బీకాం నందు 30 సీట్లు, బీఎస్సీ కంప్యూటర్స్ నందు 25 సీట్లు, బీఎస్సీ బాటని నందు 15 సీట్లు కలవు అని, వీటికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఫీజు రీయంబర్స్మెంట్ లేదా స్కాలర్షిప్ పథకాలు వర్తించవు అని వారు తెలిపారు. సీట్లు కావలసిన వారు ఈ నెల 20వ తేదీ లోపల కళాశాల నందు సంప్రదించవలసిందిగా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9912679876 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.

    ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

    స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియా
    విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం (ఇన్ ఫర్టిలిటీ) అనేది చేయదగిన మరొక వైద్య స్థితి అని తెలిపారు. గర్భం దాల్చడానికి సంవత్సర కాలంగా ప్రయత్నిస్తూ ఉండడం, అనేకసార్లు గర్భస్రావాలు కావడం, అనేక ఐ యు ఐ లేదా ఐ వి ఎఫ్ వైఫల్యాలు కలగడం, రిపోర్టులు మామూలుగా ఉన్నప్పటికీ గర్భం దాల్చలేక పోవడం, వీర్యం కౌంట్ తక్కువగా ఉండడం లేదా వీర్యం కౌంట్ లేకపోవడం, పి సి ఓ ఎస్ సమస్యలు, పాలో పియన్ ట్యూబ్ పోవడం, ఎండ్రోమెట్రియోసిస్ లేదా గర్భాశయం లో ఫైబ్రాయుళ్లు ఉండదన్న అభిప్రాయాలు వాటికి నిపుణులైన వైద్యులచే చికిత్స నిర్వహించబడినది తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సంతానము లేని దంపతులు సద్వినియోగం చేసుకొని సంతానము కలిగించుకొని చక్కటి జీవితాన్ని పొందాలని తెలిపారు.