డిప్యూటీ డిఎంహెచ్వో. డాక్టర్. భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; అధిక ప్రమాద గర్భధారణ పై ధర్మవరం డివిజన్: డి ఎం అండ్ హెచ్ వో డాక్టర్ ఫైరోజా బేగం గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ధర్మవరం డివిజన్ పరిధిలోని పీహెచ్సీ లు, యూపీహెచ్సి లలో పనిచేస్తున్న ఏఎన్ఎం లకు సమీకృత అధిక ప్రమాద గర్భధారణల నిర్వహణపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఆగస్టు 10, 11 తేదీలలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు అధిక ప్రమాద గర్భ దారులపై పూర్తి వివరణ ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ అధిక ప్రమాద గర్భధారణలను ముందుగానే గుర్తించడం, గర్భిణులకు తగిన జాగ్రత్తలు సూచించడం, సంభవించే సమస్యలను నివారించడం, అవసరమైన వైద్య సేవలు అందించడం, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత రెఫర్ లకు సకాలంలో రిఫర్ చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో డి ఐ ఓ. డాక్టర్ చెన్నారెడ్డి, డాక్టర్ సురేష్ నాయక్, డాక్టర్ గోవర్ధన్ , డాక్టర్ పుష్పలత , డాక్టర్ చరణ్ , డిప్యూటీ హెచ్ ఈ ఓ విజయ్ కుమార్ , సి ఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అధిక ప్రమాద గర్భధారణలపై ఏఎన్ఎం లకు శిక్షణతరగతులు..
గ్రంథాలయ అభివృద్ధికి రంగనాథన్ కృషి ఆదర్శం…
విశాలాంధ్ర–నార్పల (అనంతపురం జిల్లా) :- భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవ వేడుకలను నార్పల శాఖ గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ పలువురు కొనియాడారు.డాక్టర్ రంగనాథన్ రూపొందించిన గ్రంథాలయ శాస్త్ర సూత్రాలు నేటికీ గ్రంథాలయ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, గ్రంథాలయాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కావేరి, విద్యార్థినీ విద్యార్థులు, లక్ష్మీనారాయణ, శ్రీరాములు, నాగార్జున, లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
యువతే దేశ భవిష్యత్తుకు దిక్సూచి
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో ఆన్సెట్ అనంతపురం సహకారంతో బుధవారం ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టి. శైలజారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు, కళాశాల సూపరింటెండెంట్ అన్వర్ బాషా, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఎల్.ఎస్. రెడ్డి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, లక్ష్యసాధన, సామాజిక బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, కంప్యూటర్ అప్లికేషన్స్ లెక్చరర్ ఎం. సుధాకర్ సమన్వయంతో నిర్వహించగా, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గాయత్రి సహకరించారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రంథాలయ అభివృద్ధికి రంగనాథన్ కృషి ఆదర్శం…
విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) :- భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి సందర్భంగా జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవ వేడుకలను నార్పల శాఖ గ్రంథాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రంథాలయ రంగ అభివృద్ధికి ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ పలువురు కొనియాడారు.డాక్టర్ రంగనాథన్ రూపొందించిన గ్రంథాలయ శాస్త్ర సూత్రాలు నేటికీ గ్రంథాలయ వ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, గ్రంథాలయాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి భావితరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కావేరి, విద్యార్థినీ విద్యార్థులు, లక్ష్మీనారాయణ, శ్రీరాములు, నాగార్జున, లక్ష్మీనాయక్ తదితరులు పాల్గొన్నారు.
యువతే దేశ భవిష్యత్తుకు దిక్సూచి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో ఆన్సెట్ అనంతపురం సహకారంతో బుధవారం ప్రత్యేక అవగాహన, ప్రేరణాత్మక కార్యక్రమం నిర్వహించారు. కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ డా. టి. శైలజారాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు, కళాశాల సూపరింటెండెంట్ అన్వర్ బాషా, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్ ఎల్.ఎస్. రెడ్డి విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాభివృద్ధి, లక్ష్యసాధన, సామాజిక బాధ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, కంప్యూటర్ అప్లికేషన్స్ లెక్చరర్ ఎం. సుధాకర్ సమన్వయంతో నిర్వహించగా, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ గాయత్రి సహకరించారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
రిలయన్స్ సంస్థ సహకారంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా, అంతర్జాతీయ స్థాయి ఃసెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ఃగా ఐఎస్ఏను అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం.మరికొన్ని అంతర్జాతీయ సంస్థలను కూడా భాగస్వాములుగా చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఐఎస్ఏ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఆగస్టు నెలాఖరులోగా రిలయన్స్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉంది.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఐఎస్ఏను ఏర్పాటు చేయనున్నారు.
ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్.. డిజిటల్ అగ్రికల్చర్లో మాస్టర్స్
ఐఎస్ఏలో వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు సంబంధించిన ఆధునిక, సాంకేతిక అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.రాష్ట్రంలో ఇప్పటికే వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ, మత్స్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.ఆయా విశ్వవిద్యాలయాల్లో వివిధ సంప్రదాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.అయితే వాటికి భిన్నంగా ఐఎస్ఏ ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), డిజిటల్ అగ్రికల్చర్, వాతావరణ సుస్థిరత వంటి కీలక అంశాలపై ఐఎస్ఏలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు.ఎంబీఏ అగ్రికల్చర్ లీడర్షిప్, డిజిటల్ అగ్రికల్చర్లో మాస్టర్స్ కోర్సులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ వంటి ప్రపంచస్థాయి కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు.
పెట్టుబడుల ఆకర్షణకు కేంద్రంగా..
ఆధునిక వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేలా కోర్సులను రూపొందించనున్నారు.వ్యవసాయ విద్య, పరిశోధనకే పరిమితం కాకుండా ఆహారశుద్ధి, రవాణా, అగ్రిటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా ఐఎస్ఏను తీర్చిదిద్దనున్నారు.ఈ ప్రాజెక్టుకు రిలయన్స్ గ్రూప్ యాంకర్ భాగస్వామిగా వ్యవహరించనుంది.స్టార్టప్లకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లను ఏర్పాటు చేయడంలో రిలయన్స్ కీలక పాత్ర పోషించనుంది.
ఇదే సమయంలో జాన్డీర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, నెస్లే వంటి అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.విద్యాబోధనకు మాత్రమే పరిమితం కాకుండా ఐఎస్ఏను మేధోమథన కేంద్రంగా, వ్యవసాయ రంగంలో కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలకు దోహదపడే ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.తద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో పెట్టుబడులు, పరిశోధనలు, స్టార్టప్లకు ఒకే వేదికగా ఐఎస్ఏను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) చర్చిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ ఎస్ఐపీబీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మొత్తం 37ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలు బోర్డు పరిశీలనకు వచ్చాయి. వీటి ద్వారా దాదాపు రూ.2.08లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు,పెట్టుబడుల వివరాలు,సంబంధిత అంశాలపై 20వ ఎస్ఐపీబీ సమావేశంలో చర్చిస్తున్నారు.
సమావేశానికి రాష్ట్ర మంత్రులు కె. అచ్చెన్నాయుడు,నారాయణ,టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
‘లుంగీవాలా’ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ.. ఛైర్మన్ రాధాకృష్ణ ఆగ్రహం
‘లుంగీవాలా’ వ్యాఖ్యపై రాజ్యసభలో బుధవారం తీవ్ర గందరగోళం నెలకొంది. సీపీఎం సభ్యుడు జాన్ బ్రిటాస్ తనపై ఓ మహిళా సభ్యురాలు అనుచిత వ్యాఖ్య చేశారని సభ దృష్టికి తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇరువర్గాల సభ్యుల నినాదాలతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. బ్రిటాస్ను బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ లుంగీవాలాగా సంబోధించినట్లు సమాచారం.
బ్రిటాస్ అభ్యంతరం
అత్యవసర ప్రజా ప్రాధాన్య అంశాలను ప్రస్తావించే సమయంలో బ్రిటాస్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ఓ మహిళా సభ్యురాలు తనను ‘లుంగీవాలా్ణ అని సంబోధించారని చెప్పారు. ఇది తనను, తన సంస్కృతిని అవమానించడమేనని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది.
‘అందరూ భారతీయులే‘
సభలో ప్రతి సభ్యుడూ సమానమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నమనమంతా భారతీయులమే” అని పేర్కొన్నారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్య ఏదైనా ఉంటే సంబంధిత సభ్యులను ఛైర్మన్ ఛాంబర్కు పిలిచి మాట్లాడాలని సూచించారు.ఛైర్మన్ రాధాకృష్ణన్ కూడా సభ్యులు సంయమనం పాటించాలని కోరారు. నిమన సంస్కృతి ప్రత్యేకమైనది. సంస్కృతి, గుర్తింపు, మతాన్ని అగౌరవపరచకూడదు. సంబంధిత సభ్యురాలిని నా ఛాంబర్కు పిలిచి సమస్యను పరిష్కరిస్తాను” అని చెప్పారు.
‘అది లుంగీ కాదు.. ధోతి
అయినా సభలో గందరగోళం కొనసాగింది. సభా నాయకుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, సంబంధిత వస్త్రాన్ని ‘లుంగీ‘ గా కాకుండా ‘ధోతి‘ గా పేర్కొన్నారు. మరోవైపు సుష్మితా దేవ్ వాదనను కూడా రికార్డులోకి తీసుకోవాలని చెప్పారు. ఇరువైపులా నినాదాలు కొనసాగడంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్పోర్టులకు టీఈఎఫ్ఆర్లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.అమరావతి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయాలకు సంబంధించిన టెక్నో ఎకనమిక్ ఫీజిబులిటీ రిపోర్ట్ (టీఈఎఫ్ఆర్)లు ఇప్పటికే సిద్ధమయ్యాయి.ఈ విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.సైట్ క్లియరెన్స్ల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ (ఏపీఏడీసీఎల్) అధికారులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా)కు ప్రతిపాదనలు పంపారు.మోకా నుంచి అనుమతులు వచ్చిన వెంటనే డీపీఆర్లు రూపొందించేందుకు సంస్థలను ఎంపిక చేయాలని ఏపీఏడీసీఎల్ భావిస్తోంది.
తొలి దశకు రూ.5,545 కోట్లు
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సుమారు గంట ప్రయాణంలో విమానాశ్రయాన్ని చేరుకునేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 9 జిల్లాల్లో కొత్త ఎయిర్పోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో భాగంగా తొలి దశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల నిర్మాణం, వాటికి అవసరమైన భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.మొదటి దశలో ఈ మూడు ప్రాజెక్టులకు కలిపి రూ.5,545 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.అవసరమైన నిధుల్లో కొంత మొత్తాన్ని హడ్కో నుంచి రుణంగా సమీకరించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతి విమానాశ్రయం.. పీపీపీ విధానంలో
అమరావతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.పీపీపీ-డీబీఎఫ్వోటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్) విధానంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రతిపాదించింది.మొదటి దశ నిర్మాణానికి రూ.4,419 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.విమానాశ్రయం కోసం అవసరమైన 4,618 ఎకరాలను భూ సమీకరణ విధానంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.అలాగే రూ.1,087 కోట్లతో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనుంది.ఇందులో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
శ్రీకాకుళంలో ఏఏఐ భాగస్వామ్యంతో..
శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదించిన విమానాశ్రయం మొదటి దశను రూ.392 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రాజెక్టును ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) భాగస్వామ్యంతో చేపట్టేందుకు ప్రతిపాదించింది.ఇందుకు సంబంధించిన రాయితీ ఒప్పందాన్ని ఏఏఐ పరిశీలన కోసం పంపింది. విమానాశ్రయ నిర్మాణం కోసం మొత్తం 1,185.86 ఎకరాలను గుర్తించారు.వీటి భూసేకరణకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.భూసేకరణ కోసం రూ.213 కోట్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.320.90 కోట్లు అవసరమని అంచనా వేసింది.ఇందులో రూ.237.55 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
కుప్పంలో క్యాపెక్స్ విధానంలో..
చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్మించనున్న విమానాశ్రయం మొదటి దశకు రూ.734 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఇందుకోసం మొత్తం 1,788 ఎకరాలను గుర్తించింది. ఇందులో ఇప్పటికే 1,300 ఎకరాలను సేకరించింది.కుప్పం విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ కోసం రూ.198.75 కోట్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.146.73 కోట్లు ఖర్చు చేయనుంది.ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్లో రూ.313.25 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.అంతేకాకుండా రూ.100 కోట్లతో రహదారుల నిర్మాణానికి గుత్తేదారులకు ఇప్పటికే అనుమతులు ఇచ్చింది.
ఆపరేషన్, నిర్వహణకు ఎన్వోసీ
రాష్ట్ర ప్రభుత్వం భరించే క్యాపెక్స్లో 15 శాతం మార్జిన్ ప్రాతిపదికన విమానాశ్రయ నిర్వహణ, కార్యకలాపాలను చేపట్టేందుకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ముందుకొచ్చింది.ఈ మేరకు షరతులతో కూడిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (మోకా)కు సమర్పించింది.
హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ టీమ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో పలువురు విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.డ్రగ్ టెస్టులు నిర్వహించగా మొత్తం 17 మంది విద్యార్థులకు పాజిటివ్గా తేలింది.ఇదే వ్యవహారంలో డ్రగ్స్ విక్రయిస్తున్న హెచ్సీయూ పూర్వ విద్యార్థిని అధికారులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఆధారంగా తనిఖీలు
ఈగల్ టీమ్కు అందిన సమాచారంతో అధికారులు హెచ్సీయూ ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల సమయంలోనే గంజాయి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో 17 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది.విద్యార్థులు గంజాయిని ఎలా వినియోగిస్తున్నారు, వారికి అది ఏ మార్గంలో చేరుతోంది అనే వివరాలను అధికారులు సేకరించారు.
అస్సాం నుంచి గంజాయి సరఫరా
హెచ్సీయూ విద్యార్థులకు గంజాయి ఎలా చేరుతోందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో అస్సాం నుంచి గంజాయిని తీసుకొచ్చి యూనివర్సిటీ పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంలో మరెవరెవరి ప్రమేయం ఉంది? గంజాయి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
పూర్వ విద్యార్థిని విచారిస్తున్న ఈగల్ టీమ్
గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించిన హెచ్సీయూ పూర్వ విద్యార్థిని ఈగల్ టీమ్ ప్రస్తుతం విచారిస్తోంది. అతడికి గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు ఎవరు, వారి వెనుక ఉన్న నెట్వర్క్ ఏమిటి అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. యూనివర్సిటీలో విద్యార్థులకు డ్రగ్స్ చేరకుండా కట్టడి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హెచ్సీయూలో గంజాయి సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ను గుర్తించి, దానికి అడ్డుకట్ట వేసేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

