Wednesday, February 18, 2026
Home Blog Page 2

మోదీపై పోరుకు తరుణమిదే!

0

. రూపాయితోపాటు మోదీ గ్రాఫ్ పతనం
. ఈయూ, అమెరికాతో ఒప్పందాలు భారత్‌కే నష్టం
. ఎన్‌డీఏ పాలనలో అప్ప్పులపాలైన దేశం
. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో రామకృష్ణ
. ఎలాంటి పోరాటానికైనా రైతులు సిద్ధం: వెంకయ్య
. సమస్యను గాలికొదిలేసి లడ్డూ రాజకీయం
. మత విభజన రాజకీయాలపై పోరాడతాం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ : ఆరఎసఎస్, బీజేపీ, ప్రాని మోదీకి వ్యతిరేకంగా పోరాడటానికి సరైన తరుణమిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశంలో దశాu్దకాలంగా పాలనలో ఉన్న మోదీ గ్రాఫ్ పడిపోయిందని, దేశవ్యాప్తంగా ఆయన పట్ల వ్యతిరేకత పెరిగిందని, మేధావులు, లౌకిక, ప్రజాస్వామ్యవాదులు ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారని, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి విస్తత, బలమైన పోరాటాలు నిర్వహించడానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం కాకినాడలో ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యదర్శివర్గసభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా రామకష్ణ హాజరై… అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై ప్రసంగించారు. ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం విచ్చలవిడిగా పెరిగిందని, వెనిజులా, క్యూబా, పలస్తీనా, ఇరాన్ దేశాలపై అనుసరిస్తున్న దురాక్రమణ విధానాలే ఇందుకు సాక్ష్యమని అన్నారు. అమెరికా చర్యలను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు ఖండించినా… భారత్ మాత్రం నోరుమెదపడం లేదని, భారత ప్రతిష్ట దెబ్బతినేలా మోదీ విదేశాంగ విధానం ఉందని విమర్శించారు. యూరోపియన్ యూనియన్, అమెరికాతో ఇటీవల మోదీ ప్రభుత్వం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారత్‌కు నష్టదాయకమని అన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ పాలనలో భారతదేశం పూర్తిగా అప్ప్పులపాలైపోయిందని, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు 55 లక్షల కోట్ల రూపాయలు అప్ప్పు ఉండగా… మోదీ 11 ఏళ్ల పాలనలో ఈ అప్ప్పు 214 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. కార్పొరేట్లకు ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతున్న మోదీ… చివరకు దేశాన్నే అమ్మకానికి పెట్టేశారని, దేశ చరిత్రలో ఏనాడూ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొనలేదని విమర్శించారు. సమస్యలన్నింటినీ పక్కనబెట్టి మత ఎజెండాతో ముందుకుపోతున్న మోదీ సర్కారు ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐతో పాటు చివరకు సుప్రీంకోర్టును సైతం తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నుతోం దని ఆరోపించారు. జీ రామ్ జీ పథకంలో ఉపాధి హక్కుకే ముప్ప్పు ఏర్పడిందని, ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఎసఐఆర్‌తో లక్షలాది ఓట్ల తొలగింపునకు పూనుకుంటు న్నారని అన్నారు. ప్రతి ఆఫీసులోనూ ఒక ఆరఎసఎస్ కార్యకర్తను గూఢచారిగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం… ప్రత్యేక రహస్య ఎజెండాతో పాలిస్తున్నదన్నారు. రూపాయి పతనంతోపాటు మోదీ గ్రాఫ్ కూడా పూర్తిగా పడిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లడ్డూ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని, పవన్ కల్యాణ్ పక్కా అవకాశవాదిగా మారిపోయారని అన్నారు. టీడీపీ, జనసేనతోపాటు వైసీపీ సైతం మోదీకి మోకరిల్లుతోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో భావసారూప్య పార్టీలతో కలిసి పోరాటాలు నిర్మించాలని, అందుకోసం ఈ కౌన్సిల్ సమావేశాలు సరైన చర్చా వేదికగా మారాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలతో అన్నదాత పరిస్థితి దారుణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. నాలుగు కార్మిక కోడ్‌ల రద్దుకు కార్మికవర్గంతో కలిసి రైతులంతా పోరాటానికి దిగారని, వారిలో అసంతప్తి పెరగడానికి ఇంతకుమించిన ఉదాహరణ ఉండదని అన్నారు. ఉపాధి హామీ చట్టం రద్దుచేసి… జీ రామ్ జీ చ{్టం తీసుకువచ్చిన ప్రభుత్వం గ్రామీణ ఉపాధి రంగంతోపాటు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడానికి కంకణం కట్టుకున్నదన్నారు. అసంతప్తితో రగిలిపోతున్న రైతులు ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని వెంకయ్య చెప్పారు.
చాపకింద నీరులా ఆరఎసఎస్
భావజాలం: ఈశ్వరయ్య
ఏపీ చరిత్రలోనే తొలిసారిగా ఆరఎసఎస్ మతోన్మాద భావజాలం చాపకింద నీరులా ఇంటింటికీ చేరుతోందని, ఇది అత్యంత ప్రమాదకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య హెచ్చరించారు. కాకినాడలో ప్రారంభమైన సీపీఐ కౌన్సిల్ సమావేశాల్లో ఈశ్వరయ్య రాజకీయ, నిర్మాణ, కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయం లడ్డూ చుట్టూ తిరుగుతోందని, కూటమి పక్షాలు తమ రాజకీయ గ్రాఫ్ పెంచుకోవడం, అసలు సమస్యలను పక్కకు నెట్టేయడమే ఈ లడ్డూ రాజకీయ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మత విభజన రాజకీయాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కార్యకర్తలు ఆర్థిక, రాజకీయ పోరాటాలతోపాటు ప్రమాదకరమై ఆరఎసఎస్ భావజాలానికి వ్యతిరేకంగా శాస్త్రీయ విశ్లేషణ, అవగాహన పెంచేందుకు కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఆంధ్రాలో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్రీట్‌మెంట్ కోసం పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారని, ఇంకోవైపు ప్రభుత్వ అధ్వర్యంలో భూముల అమ్మకాలు యధేచ్ఛగా సాగిపోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యేల్లో అవినీతి విచ్ఛలవిడిగా పెరిగిపోయిందని, వీటన్నింటినీ దష్టిలో పెట్టుకొని కూటమి విధానాలకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాటాలు రూపకల్పన చేయాలని ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ముందుగా సంతాప తీర్మానాన్ని కార్యదర్శివర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ ప్రవేశపెట్టగా, సభ్యులు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రారంభ కార్యక్రమంలో వేదికపై జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ముప్పాళ్ళ నాగేశ్వరరావుతోపాటు జాతీయ సమితిసభ్యులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆశీనులయ్యారు. ఈ సమావేశాలు రెండోరోజు బుధవారం కూడా కొనసాగుతాయి.

ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు

0

పొరపాటుగా ఇచ్చిన స్టేతో ఎంజాయ్ చేశారు… సరిచేస్తున్నాం

. ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందే
. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
. డిశ్చార్జి పిటిషన్ తిరస్కరించిన సుప్రీం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితురాలైన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని (డిశ్చార్జ్) ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేయగా… దానిని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో సీబీఐ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఆమెపై విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, దీనిలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. పదవిలో ఉన్నంతకాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు… డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. వేరే కేసుగా భావించి తొలుత స్టే ఇచ్చామని, ఇప్ప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది. పొరపాటుగా ఇచ్చిన స్టేతో నిందితులు ఇప్పటివరకు ఎంజాయ్ చేశారని వ్యాఖ్యానించింది. ఇకపై ట్రయల్ కోర్టులో విచారణ ఎదుర్కోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కర్నాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ సంస్థకు అనంతపురం జిల్లాలో మైనింగ్ లీజులు కేటాయించారు. కేటాయించిన సరిహద్దులు దాటి ఓఎంసీ సంస్థ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందని, అటవీ భూములను ఆక్రమించిందని ఆరోపణలు వచ్చాయి. సుమారు 8.5 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఓఎంసీకి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని సీబీఐ ఆమెను నిందితురాలిగా చేర్చింది. నిబంధనల ప్రకారం గనుల నుంచి తీసిన ఖనిజాన్ని సొంత పరిశ్రమలకే విని యోగించాలి. అటువంటి దానిని క్యాప్టివ్ మైనింగ్ అంటారు. కానీ శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి మేలు చేసేందుకు కావాలనే ఆ పదాన్ని జీవో నుంచి తొలగించి… ఖనిజాన్ని బయట అమ్ముకునేలా అక్రమా లకు దారులు తెరిచినట్లు కోర్టు దష్టికి సీబీఐ తెచ్చింది. 2011లో ఆమె ఈ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లారు. పదేళ్లకు పైగా ఈ కేసు విచారణ దశలోనే ఉంది. తనపై ఉన్న ఆరోపణల్లో నిజం లేదని, విచారణ నుంచి తనను తప్పించాలని ఆమె చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా సుప్రీం తీర్పుతో బ్రేక్ పడింది.

ఇందాపూర్ నెయ్యిపై రగడ

0

మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం

. చైర్మన్ తిరస్కరణ… పోడియం ఎక్కి నినాదాలు
. అడుగడుగునా వాయిదాలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా అంశంపై శాసనమండలి మంగళవారం దద్దరిల్లింది. దీనిపై వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కల్తీ నెయ్యిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత మైకులు పనిచేయకపోవడంతో గంటపాటు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ మయ్యాక ఇందాపూర్ నెయ్యి అంశాన్ని వైసీపీ సభ్యులు మళ్లీ ప్రస్తావించారు. నినాదాలు, ప్లకార్డులతో గందరగోళం సష్టించారు. పోడియాన్ని చుట్టుముట్టారు. ‘నెయ్యి కల్తీ కల్తీ…బాబు పాలన కల్తీ కల్తీ… కూటమి పాలన కల్తీ కల్తీ..’అంటూ నినదిం చారు. సభ్యులకు సర్దిచెప్పడానికి చైర్మన్ ప్రయత్నించారు. తమ తమ సీట్లలో కూర్చోవాల్సిందిగా సూచించారు.
అయినా వైసీపీ సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. కొద్దిసేపటికి సభ తిరిగి సమావేశమయ్యాక చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్, వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తమ ప్రశ్నలకు జవాబులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ సభ్యులు మళ్లీ చైర్మన్ పోడియం ఎక్కి గందరగోళం సష్టించారు. గోవిందా… గోవిందా అంటూ నినదించారు. వైసీపీ సభ్యుల ఆందోళన మధ్య మంత్రులు సమాధానాలిచ్చారు. గందరగోళం మధ్య మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు లేవడంతో వైసీపీ సభ్యులు ఆందోళన ఆపారు. దీన్ని గమనించిన చైర్మన్… మంత్రులు మాట్లాడుతున్నప్ప్పుడు నినాదాలు చేసి… ప్రతిపక్ష నేత మాట్లాడేటప్ప్పుడు మౌనంగా ఉంటారా? ఇది పద్ధతి కాదన్నారు. వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని మరోసారి వాయిదా వేశారు. పదేపదే చెప్పినా వైసీపీ సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.

పని చేయని వారికిజీతాలెందుకు?

0

శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు

విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్‌లో అధికార, ప్రతిపక్షాల తీరుపై సూటిగా, స్పష్టంగా స్పందించారు. ‘రైట్ టు రీకాల’ ప్రతిపాదనను తాను ఇప్పటికే లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారని, దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. మంగళవారం సభ ఆలస్యానికి కారణం సాంకేతిక లోపమేనని, ‘టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నప్ప్పుడు వేచి చూడాల్సిందే. కానీ వైసీపీ నేతలు దీనిపై కూడా బురద జల్లడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని విమర్శించారు. సభకు సభ్యులు రాలేదని, కోరం లేదని వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. గతంలో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయే సంస్కృతి ఉండేదని, కానీ ఇప్ప్పుడు పరిస్థితి మారిందని స్పీకర్ వివరించారు. సభ్యులు అసెంబ్లీకి రావడం మాత్రమే కాదు, సభ లోపల ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు కూర్చున్నారనేది సాఫ్ట్‌వేర్ రికార్డ్ చేస్తోందని తెలిపారు. డిజిటల్ అటెండెన్స్ వల్ల సభ్యుల బాధ్యత పెరుగుతుందని, ప్రజలకు వారు ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొందని, రాయలసీమ నుంచి విశాఖ వరకు ఉన్న పాఠశాలల నుంచి దాదాపు 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మునుపటిలా ప్రత్యక్షంగా పోరాడకుండా… ఇప్ప్పుడు వెనుక ఉండి గోతులు తీసే రాజకీయాలకు వైసీపీ తెరలేపిందని స్పీకర్ ఆరోపించారు. సభకు రాకుండా బయట ఉండి విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వారిపై త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సిద్ధార్థరెడ్డి… లొంగిపో

నటి ప్రత్యూష మృతి కేసుపై సుప్రీం తీర్పు

న్యూదిల్లీ : రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం… నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్ప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా… సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7.30-8 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సీబీఐ… నిందితుడిపై 306 (ఆత్మహత్యకు పురికొల్పడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా… జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది.
24 ఏళ్లుగా నరకం: ప్రత్యూష తల్లి
తన కుమార్తె మృతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీదేవి స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని అన్నారు. ప్రత్యూష మృతి సమయంలో కొన్ని బెదిరింపులు వచ్చాయని, తన కూతురిది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె తెలిపారు. న్యాయం కోసం మొదటి నుంచీ ఒంటరి పోరాటం చేస్తున్నానని, ఉన్నతస్థాయికి చేరుకోవాల్సిన తన కూతురి జీవితం నాశనమైందన్నారు. నిందితుడు సిద్ధార్థరెడ్డి విదేశాల్లో ఉన్నాడని తెలిసిందన్నారు. ఈ కేసును తొలి దశలోనే తారుమారు చేశారని ఆరోపించారు. తన వద్ద ఉన్న కొన్ని సాక్ష్యాలతోనే పోరాటం చేస్తూ వచ్చానని, అప్ప్పుడే అన్ని సాక్ష్యాలు ఉండి ఉంటే అతడికి తప్పకుండా జీవితకాల శిక్ష పడేదని అభిప్రాయపడ్డారు. కన్నతల్లిగా తాను ఇచ్చిన వాంగ్మూలం పక్కన పెట్టేశారన్నారు. 24 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నానని, ఇన్నేళ్లలో ఎవరూ తనకు తోడుగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కీలక రంగాల్లో భాగస్వామ్యం

0

. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ప్రధాని మోదీ చర్చలు
. రఫేల్ డీల్ సహా 20 ఒప్పందాలపై సంతకాలు
. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని నిర్ణయం
. కర్నాటకలో హెచ్-125 హెలికాప్టర్ల తయారీ ప్రారంభం

ముంబై: భారత్-ఫ్రాన్స్‌ల మధ్య బలమైన స్నేహబంధం ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఎంతో అనిశ్చితి ఉందని, భారత్-ఫ్రాన్స్‌లు దీనికి పరిష్కారం చూపిస్తున్నాయన్నారు. ప్రపంచ శాంతికి కృషి చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచాభివృద్దికి ఏఐ ఎంతో దోహదం చేస్తుందన్నారు. కర్నాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు హాజరయ్యారు. ఫ్రాన్స్ సాయంతో ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్‌ను తయారు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముంబైలోని లోక్‌భవన్‌లో సమావేశమైన ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియా ముందు ఆ వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్ భారతదేశపు పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటి అని మోదీ అన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ నుంచి ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అపూర్వమైన సహకారం అందుతుందని వెల్లడించారు. ‘భారత్, ఐరోపా సంబంధాల్లో ఈ ఏడాది ఎంతో కీలకం. కొన్నిరోజుల క్రితమే ఐరోపా కూటమితో చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్న వేళ.. ప్రపంచ స్థిరత్వానికి ఇరు దేశాల భాగస్వామ్యం ఓ శక్తిగా మారుతుంది. బహుళ ధ్రువ ప్రపంచాన్ని మేం విశ్వసిస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రఫేల్ జెట్‌ల నుంచి సబ్‌మెరైన్ వరకు రక్షణ రంగంలో ఇరు దేశాలు సహకారం అందించుకుంటున్నా యని… ఎవరెస్టంత ఎత్తు వెళ్లగలిగే హెలికాప్టర్లను ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లోనే తయారు చేయనున్నట్లు మోదీ వెల్లడించారు. యావత్ ప్రపంచానికి ఇక్కడ నుంచే అవి ఎగుమతి అవుతాయని తెలిపారు. ఉగ్రవాదం, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలపై పొంచి ఉన్న యుద్ధ ముప్పు అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. “అది ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా, ఇండో-పసిఫిక్ అయినా, ప్రతి ప్రాంతంలో శాంతి కోసం చేసే అన్ని ప్రయత్నాలకు మేము మద్దతు ఇస్తూనే ఉంటాం. ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో నిర్మూలించడం మా ఉమ్మడి నిబద్ధత. త్వరలో ఫ్రాన్స్‌లో స్వామి వివేకానంద సంస్కృతి కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ఈ రోజు సంయుక్తంగా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం” అని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. భారత్ తమకు ఎంతో విశ్వసనీయ భాగస్వామి అన్నారు. ఇరు దేశాలు చట్టబద్ధ పాలనను బలంగా నమ్ముతాయని, కొన్నేళ్లుగా దీన్ని రెండు దేశాలు నిరూపించాయన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సహకరిస్తామన్నారు. ఆత్మీయ స్వాగతం పలికినందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్` ఫ్రాన్స్ మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగింపుపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదవ తరం విమాన ఇంజిన్లపై కలిసి పనిచేస్తామని మాక్రాన్ పేర్కొన్నారు. రాఫెల్, జలాంతర్గాములు, హెలికాప్టర్ల సరఫరాకు గాను ఒప్పందాలపై సంతకం చేశామన్నారు. ఐదవ తరం యుద్ధ విమానాలపై భాగస్వామిగా ఉంటామన్నారు. సాంకేతిక బదిలీపై ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రెండు దేశాలు సమాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామన్నారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల సంబంధాలు బలపడ్డాయని మాక్రాన్ తెలిపారు. జులైలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఆహ్వానించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా రఫేల్ డీల్‌తో సహా 20 ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. రక్షణరంగం , ఏఐ టెక్నాలజీ , స్పేస్ టెక్నాలజీ రంగంలో కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. మొత్తంగా 20 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. కాగా 19న దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు మాక్రాన్ హాజరవుతారు.

గజాకు ఐదు బిలియన్ డాలర్ల సాయం

ట్రంప్

వాషింగ్టన్: గజాలో మానవతావాద, పునర్నిర్మాణ యత్నాల కోసం ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయం అందించేందుకు ‘శాంతి బోర్డు’లోని సభ్యదేశాలు హామీ ఇచ్చాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. బోర్డు సభ్యులు మొట్టమొదటిసారి గురువారం వాషింగ్టన్‌లో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటన చేశారు. ఆ సమావేశంలో సాయంపై ప్రకటన ఉంటుందని ‘ట్రూత’లో పోస్ట్ చేశారు. గజాలో భద్రత, శాంతి కోసం ఏర్పాటు చేసే అంతర్జాతీయ స్థిరీకరణ దళం, స్థానిక పోలీసింగ్ వ్యవస్థ కోసం వేలాది మంది సిబ్బందిని పంపేందుకు కూడా బోర్డులోని సభ్య దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. ‘ఈ నెల 19వ తేదీ నేను మరోసారి బోర్డు సభ్యులను కలుస్తాను. ఆ సమావేశంలోనే ఆర్థిక సాయంపై ప్రకటన వెలువడుతుంది’ అని ట్రంప్ చెప్పారు. ప్రభుత్వ అధినేతలు సహా 20 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారని… వాషింగ్టన్‌లోని డోనాల్డ్ జే.ట్రంప్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో సమావేశం జరుగుతుందని అన్నారు. అమెకా విదేశాంగ శాఖ ఇటీవలే యూఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్‌కు అధ్యక్షుడి పేరును చేర్చింది. కాగా శాంతి బోర్డులో 24 మందికి పైగా వ్యవస్థాపక సభ్యులు ఉండగా వారిలో ఎంతమంది సమావేశానికి హాజరవుతారో తెలియడం లేదు. గత వారం శ్వేతసౌధంలో ట్రంప్‌ను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ భేటీకి రాకపోవచ్చునని తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాలతో పాటు టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇజ్రాయిల్, ఇండోనేసియా ఈ బోర్డులో సభ్యులుగా ఉన్నాయి.

ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం

ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్
న్యూయార్క్: ప్రపంచ శాంతిభద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని… అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐరాస నిర్వహిస్తున్న శాంతి పరిరక్షక మిషన్లలో అత్యధికంగా 5వేల మంది భారత భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇందుకోసం భారత్‌కు ఐరాస సదా రుణపడి ఉంటుందన్నారు. 2007లో లైబీరియాలో శాంతి పరిరక్షక మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్‌ను అందించిన ఘనత భారత్‌కే దక్కుతుందని ఆయన చెప్పారు. జీ20 కూటమి సదస్సును భారత్ నిర్వహించిన సమయంలోనే అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని… భారత్ చొరవ వల్లే గ్లోబల్ సౌత్‌కు మేలు చేసే నిర్ణయాలను ఆ సదస్సులో తీసుకోవడం సాధ్యమైందన్నారు.
ఇక ప్రపంచంలోని ఏదైనా దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ, శాంతిభద్రతలు ప్రశ్నార్ధకంగా మారితే అక్కడికి ఐరాస పీస్ కీపింగ్ మిషన్లను పంపుతుంటామని… ఒక బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా, ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకూ భారత్ చేయూత అందిస్తోందని కొనియాడారు. అంతర్జాతీయ సమాజం కోసం ఐరాస ద్వారా భారత్ చాలా పనులు చేస్తోంది. అందుకే భారత్‌కు మేం అధిక ప్రాధాన్యతను ఇస్తాం. జీ7 లాంటి కూటములలో కేవలం సంపన్న దేశాలే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటన్నింటి సంయుక్త వాటా చాలా తక్కువ. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక వాటాను భారత ఆర్థిక వ్యవస్థే కలిగి ఉందని గుటెరస్ పేర్కొన్నారు. న్యూదిల్లీలో సోమవారం ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సు 20 వరకు జరగనుండగా… ఈ సదస్సుకు గుటెరెస్ హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో భేటీ అవుతారు. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ స్థాయి టెక్ కంపెనీల ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు.

పోతూ…పోతూ అగ్గి రాజేసిన యూనస్భారత్ ‘ఏడు రాష్ట్రాల’ ప్రస్తావన

ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేసిన ఆయన తన ప్రభుత్వం మంగళవారం నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తుందని ప్రకటించారు. అయితే, ఈ ప్రసంగంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా భారత్‌ను ఉద్దేశించి చేసినవి ఇప్పుడు దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తన ప్రసంగంలో యూనస్ “బంగ్లాదేశ్ ఇకపై విధేయతతో కూడిన విదేశాంగ విధానాన్ని అనుసరించే దేశం కాదు. ఇతర దేశాల సూచనలు, సలహాలపై ఆధారపడదు” అని స్పష్టం చేశారు. తమ 18 నెలల పాలనలో దేశ “సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలు, గౌరవాన్ని” తిరిగి నిలబెట్టామని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించినవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ‘ఏడు సోదరి రాష్ట్రాలు’ (భారత్ లోనివి), నేపాల్, భూటాన్‌లకు తమ దేశ సముద్ర మార్గం గొప్ప అవకాశమని యూనస్ పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2024 ఆగస్టులో అధికారంలోకి వచ్చిన యూనస్ ప్రభుత్వం, ఇటీవలి ఎన్నికల అనంతరం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి అధికార పగ్గాలు అప్పగించనుంది. గడిచిన కొంతకాలంగా భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు కొంత ఒడిదుడుకులకు లోనైన నేపథ్యంలో యూనస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్

న్యూదిల్లీ: టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే ‘తొలి ట్రిలియనీర’ హోదాను దక్కించుకోను న్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే మస్క్ ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ 850 బిలియన్ డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందంటే.. ప్రపంచంలోని మరో ముగ్గురు అగ్రశ్రేణి కుబేరుల మొత్తం సంపద కంటే ఇది ఎక్కువ. లారీ పేజ్ (గూగుల్): 251 బిలియన్ డాలర్లు, సెర్గీ బ్రిన్ (గూగుల్): 231 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్‌బర్గ్ (మెటా): 219 బిలియన్ డాలర్లు.. ఈ ముగ్గురి మొత్తం సంపద 701 బిలియన్ డాలర్లు కాగా మస్క్ ఒక్కరి సంపదే 850 బిలియన్ డాలర్లు కావడం విశేషం. మస్క్ సంపద ఇంత వేగంగా పెరగడానికి ఇటీవల జరిగిన ఒక భారీ ఒప్పందమే ప్రధాన కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ ఏఐని స్పేస్ ఎక్స్ 1.25 ట్రిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. విలీనమైన ఈ కొత్త సంస్థలో మస్క్‌కు 43 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 530 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఈ ఏడాది మస్క్ ట్రిలియనీర్‌గా మారే అవకాశం 75 శాతం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీనికి అదనంగా త్వరలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు 25 బిలియన్ డాలర్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే, మస్క్ నికర విలువ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.