Friday, June 20, 2025
Home Blog Page 2

బెట్టింగ్ లకు పాల్పడిన వారి కుటుంబాలకు పరామర్శలా ? జగన్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన షర్మిల

తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్ లకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బెట్టింగ్ లకు పాల్పడి, ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు విగ్రహాలు కట్టడమేంటని ప్రశ్నించారు. జగన్ నిన్నటి పర్యటన కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారని… వీరి మరణాలకు కారణమెవరని ప్రశ్నించారు. బల ప్రదర్శనలు చేసి ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ చేయాల్సింది బలప్రదర్శనలు కాదని… ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని హితవు పలికారు.

ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో బీటీ రోడ్ నిర్మాణానికి భూమిపూజ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణ ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో నూతనంగా నిర్మించబోయే బ్లాక్‌టాప్ (బీటీ) రోడ్ పనులకు భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, వైద్య సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోజుకు వేలాది మంది రోగులు వస్తుండగా, రోడ్డు సదుపాయం వర్షాకాలంలో అత్యంత దయనీయ స్థితిలో ఉండటం వల్ల రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ప్రజల విజ్ఞప్తి మేరకు, మంత్రి వెంటనే స్పందించి బీటీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఆసుపత్రి పరిసరాల్లో తగిన రహదారి సౌకర్యం ఉండకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టబడుతోంది అని తెలిపారు. మంత్రి మార్గదర్శకతలో ధర్మవరం ప్రభుత్వాసుపత్రిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతామని వారు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా అమలు చేయనున్నాం అని భరోసా ఇచ్చారు. తదుపరి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ప్రభుత్వానికి, మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ధర్మవరం ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మాధవి, వైద్య సిబ్బంది, బిల్లే శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

ఏవో వరప్రసాద్ సేవలు మరువలేనివి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ సేవలు మరువలేనివని ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య, సహాయ కార్యదర్శి ఈరన్న, మండల అధ్యక్షులు సోమన్న, ప్రధాన కార్యదర్శి రామన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక రైతు భరోసా కేంద్రంలో బదిలీపై వెళుతున్న వ్యవసాయ అధికారి వరప్రసాద్ ను ఏపీయూడబ్ల్యూజే మండల కమిటీ తరుపున శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి నారాయణ, లింగమూర్తి, ఏలియస్, రాజు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలి..

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
నామాల నాగార్జున
విశాలాంధ్ర ధర్మవరం; నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినవేల విద్యార్థులను తల్లిదండ్రులను ఫీజుల పేరుతో ముక్కు పిండి కాసులు వసూలు చేస్తున్న ధర్మవరం ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖతిజున్ కుఫ్రాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున మాట్లాడుతూ… ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల వారు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా నోటీస్ బోర్డులలో ఫీజుల పట్టికను, ఉపాధ్యాయుల అర్హత వివరాలు, అదేవిధంగా విద్యార్థులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతూ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ డొనేషన్ల రూపంలో అడ్మిషన్ ఫీజు పేర్లతో సెమీ రెసిడెన్షియల్ పేరుతో అనేక రకాలుగా తల్లిదండ్రులను వేలాది రూపాయలు ఫీజులు రూపంలో దండుకుంటున్నారని మండిపడ్డారు. కావున మండల వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలలపై తక్షణం శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఏవో కు తెలియజెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి శ్రీనాథ్, పట్టణ ఉపాధ్యక్షులు అమన్, బాలాజీ ,చిన్ను పాల్గొన్నారు.

పార్టీ కమిటీల ఎంపికతో తెదేపాని మరెంత బలోపేతం చేద్దాం

కమిటీల ఎంపికలో ప్రతి కార్యకర్త,కుటుంబ సాధికారిక సారథ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం
విశాలాంధ్ర ధర్మవరం; కార్యకర్తల అభీష్టం మేరకే తెలుగుదేశంపార్టీ గ్రామ,మండల స్థాయి ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తలుపుల మండల పార్టీ ఎన్నికల పరిశీలకులు శ్రీశైలంపురుషోత్తం గౌడ్ అన్నారు.ఈసందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆయన తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తెదేపా ఎన్నికల ప్రక్రియపై మండల,గ్రామ స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు ముబారక్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా పార్టీ ఎన్నికల పరిశీలకులు పురుషోత్తంగౌడ్ మాట్లాడుతూ,గతం కంటే భిన్నంగా పార్టీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని కార్యకర్తల అభిప్రాయంతో పాటు కుటుంబసాధికారిక సారధుల అభిప్రాయాలను పార్టీ పరిగణలోకి తీసుకుంటుందని,ఒక్క పదవికి ఎంతమందైనా నామినేషన్ వేయవచ్చునని తెలిపారు. తుది నిర్ణయం రాష్ట్ర పార్టీ దేనని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామ మండల ఎన్నికల ప్రక్రియ కోసం రాష్ట్ర పార్టీ ఐవీఆర్ఎస్ ద్వారా మండలంలో గల తెలుగుదేశంపార్టీ కార్యకర్తల అభిప్రాయాలను, కుటుంబ సాధికారిక సారధుల అభిప్రాయాలను తెలుసుకుంటారని, వీటిని అన్నింటినీ క్రోడీకరించుకొని పార్టీ కమిటీల ఎన్నిక జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర పార్టీ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారము గ్రామ,మండల స్థాయి కమిటీల ఎన్నిక ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అన్ని విభాగాల పదవులకు వచ్చినటువంటి నామినేషన్ల అన్నింటిని గౌరవ శాసనసభ్యులు కందికుంటవెంకట ప్రసాద్ గారి ద్వారా జిల్లా కమిటీకి నివేదించడం జరుగుతుందని అక్కడి నుండి రాష్ట్ర పార్టీకి పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపునిచ్చి తెదేపాలో వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీలోపదవులు పొందని వారు నిరాశకు గురి కాకుండా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సారాయి కేసులోని ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయాలి…

అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషన్ నాగ ముద్దయ్య.
విశాలాంధ్ర ధర్మవరం;; దీర్ఘకాలికంగా సారాయి కేసులోని ముద్దాయిలను త్వరగా అరెస్టు చేయాలని అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ ముదయ్య
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవోదయం 2.0 లో భాగంగా బుధవారం నాడు అనంతపురం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ నాగమద్దయ్య, అనంతపురం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపర్డెంట్ శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు అకస్మాత్తుగా ధర్మవరం ఎక్సైజ్ కార్యాలయాన్ని తనిఖీ చేసారు. ఈ తనిఖీ లో స్టేషన్ లోని పలు రికార్డులను నిసితంగా పరిశీలించినారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ సారాయి కేసులోని ముద్దాయిలను అరెస్టు చేయకుండా ఉండకూడదని, వేగవంతంగా అరెస్టు అయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే నవోదయం 2.O లో భాగంగా ధర్మవరం ప్రోహిబిషన్ ,ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో సారాయి రహిత గ్రామాలు గా తీర్చిదిద్దాడానికి అందరూ కృషి చేయాలి అని సిబ్బంది కి సూచించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ధర్మవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమణి, సబ్- ఇన్స్పెక్టర్ చాంద్ బాష , నాగరాజు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యోగాతో మానసిక ఆరోగ్యం

జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ నాయుడు
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా రవాణా శాఖ ప్రాంగణం లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం యోగాంధ్ర కార్యక్రమం రవాణా శాఖ యోగ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ నాయుడు మాట్లాడుతూ… ప్రజలందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యోగ కార్యక్రమాన్నిప్రభుత్వాలు ప్రవేశపెట్టడం జరిగిందని , అందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగ చేసుకొని శారీరక ,మానసిక ఆరోగ్యం పొందాలని కోరారు –
ఈ కార్యక్రమంలో ,ముఖ్య అతిథిగా పాల్గొన్న డి యం హెచ్ ఓ ,యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డా .ఈబి దేవి , రవాణా శాఖ అధికారులు కళ్యాణదుర్గం ఆర్ టి ఓ రమేష్ , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ శ్రీనివాసులు , డి శ్రీనివాసులు ,రాజగోపాల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్స్ కె వి ఎల్ న్ ప్రసాద్ , జే శ్రీనివాస్ ,లహరి ,మనోహర్ రెడ్డి ,రఘు ,శ్వేత బిందు , ట్రాస్పోర్ట్ కాన్స్టేబుల్స్ నరసింహులు , చలపతి , నంద్యాల వై సి టి యోగ మాస్టర్స్ రామకృష్ణ రెడ్డి,రమ్య . బ్రహ్మకుమారీ శారద పాల్గొని యోగాసనాలు చేయించారు.
ఈ సందర్భంగా డి యం హెచ్ ఓ ,యోగాంధ్ర నోడల్ అధికారి డా ఈ బి దేవి మాట్లాడుతు అధికారులు సిబ్బంది , అందరూ యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషకరమని , ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశం తో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని ఒక నెల రోజులు పాటు నిర్వహించి ప్రజలందరికి నిత్య జీవితం లో యోగ ఒక భాగం చేయాలని ,ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అములు చేయుచున్నావని ,అందరూ యోగాను సాధన చేయాలని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ అధికారులు డా.రామ్ కుమార్, డా.లాల్యా నాయక్ డెమో త్యాగరాజ్ ,డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ ,పాల్గొన్నారు .

నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

ఏఐవైఎఫ్ గోడ పత్రికలు విడుదల
ఏఐవైఎఫ్ ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్

విశాలాంధ్ర అనంతపురం : నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సంతోష్ కుమార్ గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఒక్క అనంతపురం జిల్లాలోనే 7 లక్షల 24 వేల 16 మంది ఉన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు.
మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నెలకి రూ. 3 వేలు చొప్పన నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువతకి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. నిరుద్యోగ భృతి వస్తే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుదామని నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 2025 ఫిబ్రవరి నెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ద్వారా నిర్వహించిన ‘స్కిల్ సెన్సెక్స్ సర్వే’ ప్రకారం 26 జిల్లాల్లో 2.67 కోట్ల మంది దగ్గర వివరాలను సేకరించగా ఉపాధి లేని వారి సంఖ్య కోటిన్నర పైనే ఉందన్నారు. రాష్ట్రంలో 18 నుండి 50సం||ల మద్య వయస్సు వారిలో ఏ ఉపాధి లేనివారు ఒక కోటి 56 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వగణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు.
వీరిలో 52.69 లక్షల మంది ఏదో ఒక పని చేస్తున్నట్లు తెలపగా 52.74 లక్షల మంది ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలపడం గమనార్హం గా మారిందన్నారు.
నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగించేలా శిక్షణ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రకటనలే తప్ప సంవత్సర కాలంలో నిరుద్యోగ యువతకు ఒరిగిందేమి లేదన్నారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో సుమారు 3.20 లక్షల ఖాళీలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్న ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదలచేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియక కోటి ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు పోరాడితేనే భవిత అని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి ఏఐవైఎఫ్ పిలుపు నిస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో యువతకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు . నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా ప్రభుత్వ శాఖాలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేసి అమరావతిని ప్రిజోన్ గా ప్రకటించి 26 జిల్లాల నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కోసం నిరుద్యోగ అర్జీ స్వీకరణ కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రేష్ కోశాధికారి శ్రీనివాస్, జిల్లా ఉపా అధ్యక్షులు దేవ కుళ్లాయిస్వామి , జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ్,నగర నాయకులు సురేంద్ర తదితరులు పాల్గోన్నారు.

రజక వృత్తిదారులకు భద్రత కల్పించాలి

రజక శిరీష పై దాడి సిగ్గు చేటు …

రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య

విశాలాంధ్ర -అనంతపురం : రజక వృత్తిదారులకు భద్రత కల్పించాలని, రజక శిరీష పై దాడి సిగ్గు చేటు అని రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో రజక శిరీష పై దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులపై రజక శిరీష అనేమహిళలపై నిన్నట రోజు కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో అర్థ చేసిన అప్పు 80 వేల రూపాయలు కట్టాలని రజక మహిళ శిరీషను చెట్టుకు కట్టేసి కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. ఇలాంటి ఆకృత్యాలకు అంతే లేకుండా పోయిందన్నారు. నేడు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కుప్పంలో ఒక రజక మహిళను చెట్టు కట్టి తీవ్రంగా హింసించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు అగ్రవర్ణాలకు జరిగి ఉంటే ఈపాటికి రాష్ట్రమంతా కూడా అల్లాడిపోయేది అన్నారు. అదే రజకులకు ఎస్సీ హోదా ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పటిష్టమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ద్వారా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని రజకులపై దాడులు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడేది అన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఎస్సి హోదా గుర్తుకొస్తుందన్నారు . తిరిగి ఎన్నికల ముందు కమిటీ వేస్తారు అది నిర్వీర్యం అయిపోతోందన్నారు. ఇదంతా ఒకపక్క ప్రణాళికతో రజకుల నాలుగు శాతం ఓట్లు దండుకొని రజకులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు భాష, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి. నాగప్ప, గీత పని వాళ్ళ సంఘం జిల్లా కార్యదర్శి రఘు, రజక వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు టిసి భూషణ, రజకగౌరవ అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, రజక వృత్తిదాల సమాఖ్య జిల్లా నాయకులు సి. రాజు, సత్యనారాయణ, పాండు, మల్ రాయుడు, నాగరాజు, శీను, నరసింహులు, మారుతి తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం జిల్లా అధ్యక్షులుగా ద్వారకనాథ్ శర్మ ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; అఖిల భారతీయ బ్రాహ్మణ మహా సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగముకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కైపారకనాథ్ శర్మను జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఇంద్ర కంటి ప్రసాద్ శర్మ, రాష్ట్ర ప్రతినిధి అనంత కుమారి, సెల్ అండ్ సిల్క్ డెవలప్మెంట్ డైరెక్టర్ రానువ నరేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కమిటీని ఏర్పాటు చేయవలసినదిగా వారు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ద్వారకనాథ్ శర్మ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వారు తెలియజేశారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలో బ్రాహ్మణుల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని తెలుపుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.