స్వాతంత్ర్య దినోత్సవం వేడుక డే లో మార్పు తధ్యమా ?
మేధావులకు మేడా మాటలు ఆలోచింప చేస్తాయా ? లేదా భవిష్యత్ తరాలకు ప్రశ్నలు గా మిగిలిపోతాయా ?
విశాలాంధ్ర బ్యూరో – తూర్పుగోదావరి : ఇప్పుడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏమిటి ? ఈ జెండా ఆవిష్కరణ ఏమిటి ? ఆవిష్కరించిన ఈ మేడా ఎవరు ? అని ఆశ్చర్యం కలుగుతుంది కదూ ! నిజంగా ఆశ్చర్యమే అయినా తీరా చూసేసరికి అవునా ! నిజమా ! ఇంతకాలం మనకు ఈ విషయం తెలియనే లేదా అంటూ ముక్కున వేలేసుకుంటాం. వివరాల్లోకి వెళ్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటంతో 1943 అక్టోబర్ 21 న అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) ప్రధాన కార్యాలయం వద్ద అర్పిసి అధినేత మేడా శ్రీనివాస్ సారథ్యంలో అత్యంత ఘనంగా నేతాజీ సాధించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను జరుపుకున్నారు . ముందుగా జాతీయ జండాను మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు . అనంతరం భారతదేశం కోసం నేతాజీకి వెన్ను దన్నుగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్దపడిన యోధురాలు ” నీరా ఆర్యా ” ను , స్వాతంత్య్రం అనంతరం భారతదేశం కోసం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్ లను స్మరించుకున్నారు . నేతాజీ ని స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఆత్మ బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రం దినం 1943 అక్టోబర్ 21 తేది అని , ఈ రోజునే నేతాజీ సారథ్యంలో అధికారికంగా భారతీయ పాలన అధికారం లోకి వచ్చినది . ఈ రోజు భారతీయుల వీరోచిత పోరాటాలకు , నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజు నేటి రోజు . అప్పటి కొంతమంది భారతీయ బ్రిటిష్ వారి మోచేతుల నీళ్లు త్రాగిన ఆ నాటి కాంగ్రెస్ అధినేతలు భారతీయుల ప్రాణ త్యాగాలతో నేతాజీ ప్రకంపనలతో సాధించిన స్వాతంత్రియాన్ని ఎలాగైనా మరుగున పెట్టాలి అని బ్రిటిష్ వారితో కుట్రలు సాగించి ఈ వీరోచిత దినం ను చరిత్ర పుటల్లో కనుమరుగయ్యే విధంగా కుట్రలు చేసారు . నేతాజీ పేరు బ్రిటిష్ వెన్నులో వణుకు పుట్టించిన కారణంగా ఆ నాటి కాంగ్రెస్ నేతలుగా వున్న గాంధీ – నెహ్రూ లే స్వాతంత్య్రం భారతీయులకు రావటానికి కారణం అని బ్రిటిష్ వారి రికార్డులలో తప్పును ఒప్పుగా నమోదు చేయించారు . నేటికి సాధించు కున్నటువంటి స్వాతంత్య్రం ను విస్మరిస్తు గాంధీ – నెహ్రూ లు ప్రకటించిన స్వాతంత్ర్య దినం ను వేడుకగా జరుపుకుంటున్నాము . సాధించుకున్నటువంటి స్వాతంత్య్రం ను మరిచిపోతున్నాము. ఇక నుండి ప్రతి భారతీయుడు నేతాజీ సారథ్యంలో పూర్తి స్వేచ్ఛను సాధించుకున్న రోజు అక్టోబర్ 21 న స్వాతంత్ర్య వేడుకలు జరుపుకోవాలని , ప్రభుత్వం కూడా ఈ వాస్తవ వీరోచిత చరిత్రను గుర్తించి స్వాతంత్ర్య వేడుక దినంగా ప్రకటించాలి . ఈ రోజునే సెలవు దినంగా ప్రకటించాలని , నేతాజీ స్ఫూర్తితో భారతీయులు అందరు దేశం కోసంమే బ్రతకాలి , దేశం కోసమే మరణించాలి అనే ఉగ్గు పాలను జన్మతః బిడ్డలకు తల్లిదండ్రులు ఊపిరిగా నింపాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ పిలుపునిచ్చారు . యావత్ అఖండ భారతదేశంలోనే తొలి సారిగా నేతాజీ సారథ్యంలో సాధించుకున్న వాస్తవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజమండ్రి లో జరుపుకుంటున్నందుకు మిక్కిలి సంతోషంగా వుందని , ఈ ఘటన రాబోవు చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని , ఈ వీరోచిత స్వాతంత్ర్య దినం 82 ఏళ్ల అననంతరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లో జరుపుకుంటున్న ఈ చారిత్రిక అంశం ప్రపంచ చరిత్రలో లిఖించ బడుతుందనటంలో ఏ మాత్రం సందేహమే లేదు . రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఈ గొప్ప దినం ను స్వాతంత్ర్య దినంగా ఆచరించాలని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మన భారత పౌరులను కోరారు ..అనంతరం బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన భారతీయ యోధుడు శ్రీ శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటం వద్ద గౌరవ అంజలి ఘటించి పౌర వందనాలు సమర్పించారు . వందేమాతర గీతాలాపనతో దేశ భక్తిని చాటుకున్నారు . దేశం కోసం బ్రిటిష్ వారితో అంతిమ పోరాటం సాగించి స్వేచ్చను ప్రసాదించిన ఆ మహా యోధుడు మరణం ఒక మిస్టరి. ప్రజల హృదయాల్లో నేటికి జీవించి ఉన్నటువంటి ఒక మహా నేత సుభాష్ చంద్ర బోస్ . యావత్ ప్రపంచంలోనే వుండరు . నేతాజీ వంటి మరో పోరాట యోధుడు నేటికి లేరని , నేతాజీ భారతీయుల ప్రతిష్టకు ఐ కాన్ కు మించిన ఐ కాన్ వంటివారు . భారతదేశ చరిత్రలో నేతాజీ తో పాటుగా ఎందరో దేశం కోసం ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్ళను ప్రాణ భయంతో పారిపోయేలా చేసారని, ఆ నాటి కాంగ్రెస్ వాళ్ళ కుట్రలతో ఆ పోరాట యోధుల చరిత్రను , వారి పేర్లను చరిత్ర పుటల్లో లేకుండా చేసారు . ఆ నాడు బ్రిటిష్ వారు మన పౌరులపై ఆధిపత్యం చెలాయిస్తే , గాంధీ , నెహ్రులు మతోన్మాద చర్యలకు అగ్గి రాజేసి బ్రిటిష్ వారి కుట్రలకు పరోక్షంగా సహకరించరనే ఆరోపణలు బలంగా ఉండేవి . నేతాజీ మరణం సహజం కాదనేది యదార్థం అని మెజార్టీ భారతీయుల విశ్వాసం అని ఆయన కన్నీటి పర్యాంతం అయ్యారు .అనంతరం పార్టి సెక్యులర్స్ , శ్రేణులు సాధించుకున్న స్వాతంత్ర్య దినోత్సవ దినం గొప్పతనంను స్మరించుకుని స్వీట్లు పంచుకున్నారు . భారతీయుల త్యాగాలను చర్చించుకున్నారు .. అయితే మరి ఏది నిజం ? మేడా చెప్పిన 82 సంవత్సరాల నేతాజీ స్వాతంత్రం స్వాతంత్ర దినోత్సవం గా భావిద్దామా ? లేదా 78 సంవత్సరాల గాంధీ నెహ్రూల స్వాతంత్రమును స్వాతంత్ర దినోత్సవం గా భావించాలా ? అన్నది కొత్తగా ఏర్పడిన చిక్కుముడిగా మారనుందా? మేడ మాటలు మేధావులను ఆలోచనలోకి తీసుకువెళ్లి దేశవ్యాప్త చర్చకు దారితీస్తాయా లేదా భవిష్యత్ తరాలు కూడా ప్రశ్నలుగా మిగిలిపోతాయా వేచి చూడాల్సిందే ఈ చారత్రిక భారత స్వాతంత్ర్య వేడుకలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ పెండ్యాల కామరాజు , కాసా రాజు , డి వి రమణమూర్తి , లంక దుర్గా ప్రసాద్ , బర్ల ప్రసాద్, ఎమ్ డి హుస్సేన్ , దుడ్డే సురేష్ , వర్ధనపు శరత్ కుమార్ , వాడపల్లి జ్యోతిష్, కారుమూరి యుగంధర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్ , బసా సోనియా , కొల్లి సత్యనారాయణ , ద్వాదశి శ్రీనివాసరావు, కాకర ప్రసాద్ , దోషి నిషాంత్ , వల్లి శ్రీనివాసరావు, యర్రా బాల మురళి కృష్ణ , చల్లా సాంబశివరావు , ఖండవల్లి శ్రీనివాసరావు , కూరాకుల నాగమణి , మీసాల హైమావతి , మాసా అప్పాయమ్మ, నాగూరు దుర్గ , వాసంశెట్టి శిరీషా తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనియున్నారు ..