Wednesday, February 18, 2026
Home Blog Page 902

విచారణకు హాజరుకాకుండానే… ఏసీబీ కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోయిన కేటీఆర్

ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఫార్ములా ఈ-రేస్ కేసులో విచారణకు గాను ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. తనతో పాటు లీగల్ టీమ్ ను కూడా తీసుకొచ్చారు. అయితే కేటీఆర్ ను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని… లీగట్ టీమ్ ను అనుమతించబోమని కేటీఆర్ కు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని… అందుకే లాయర్లను తనతో పాటు తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పారు. అయినా పోలీసులు ఆయన లీగల్ టీమ్ ను అనుమతించేందుకు అంగీకరించలేదు. లాయర్లను అనుమతించాలని కోర్టు ఉత్తర్వుల్లో లేదని కేటీఆర్ కు పోలీసులు చెప్పారు. లాయర్లను అనుమతించకూడదనే నిబంధన ఎక్కడుందో చూపించాలని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కేటీఆర్ టీమ్ కు వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో దాదాపు 40 నిమిషాల తర్వాత కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లకుండా… అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏఎస్పీకి తన స్టేట్మెంట్ ను రాతపూర్వకంగా ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. ఏసీబీ ఆఫీసులో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ను రోడ్డుపై ఇచ్చానని చెప్పారు. సినీ దర్శకుడు రాజమౌళి కంటే పోలీసులు మంచి కథలను రాస్తున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి నుంచి బయల్దేరిన కేటీఆర్ నేరుగా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు, కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెళ్లిపోవడంతో… విచారణకు కేటీఆర్ గైర్హాజరు అయినట్టుగా పోలీసులు పరిగణిస్తారా? అనే సందేహం సర్వత్ర నెలకొంది.

ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో మోహ‌న్‌బాబు పిటిషన్

సినీ నటుడు మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జల్లపల్లిలో ఆయ‌న‌ ఇంటి వద్ద జరిగిన ఘటనల కేసులకు సంబంధించి ఆయన బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆస్తుల కోసం మంచు విష్ణు, మనోజ్ మధ్య పెద్ద పంచాయతీనే జరిగింది. జల్లపల్లి నివాసంలో మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించడం, మంచు విష్ణు అనుచరులు అడ్డుకోవడం, స్థానిక ఫుటేజ్ మాయం కావడం, న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

రెండు కేసుల్లో బెయిల్ కోసం పిటీష‌న్‌
మోహ‌న్‌బాబుపై న‌మోదైన‌ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ను ఆశ్ర‌యించారు. ఈ రెండు కేసుల‌కు సంబంధించి పిటీష‌న్ వేశారు. గ‌తంలో మోహన్ బాబు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి విదిత‌మే. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

ఇటలీ ప్రధానితో కలిసి సినిమా చూసిన ట్రంప్..

ఇటలీ ప్రధాని జార్జియా మెలొని అద్భుతమైన మహిళ అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. మెలొనిని కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శనివారం ట్రంప్ ఎస్టేట్ మార్ ఎ లాగోలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. మెలొనితో డిన్నర్ చేసిన ట్రంప్.. ఆపై ాది ఈస్ట్ మన్ డైలమా్ణ అనే సినిమా చూశారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించాయి. ాది ఈస్ట్ మన్ డైలమా్ణ సినిమా 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంటరీ.. ఎన్నికల ఫలితాలను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారంటూ ఓ లాయర్ పై అభియోగాలు మోపడమే కథాంశం. ట్రంప్, మెలొని ఇద్దరూ కలుసుకోవడం, ట్రంప్ ఎస్టేట్ లోని రిసెప్షన్ ఏరియాలో వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలను అమెరికా మీడియా సంస్థలు ఆదివారం ప్రచురించాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రోమ్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు మెలొని అమెరికా వెళ్లడం, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది.

మెలొని పర్యటన వెనక ఉద్దేశంపై ఇటలీ ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ వరుసగా విదేశీ ప్రతినిధులతో తన ఎస్టేట్ లో భేటీ అవుతున్నారు. కెనడాపై టారిఫ్ లు పెంచుతానని ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ను మార్ ఎ లాగో ఎస్టేట్ లో జస్టిన్ ట్రూడో కలుసుకున్నారు. ఇరువురు నేతలు సమావేశమై టారిఫ్ లపై చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. హంగేరి ప్రధాని విక్టర్ ఆర్బాన్ కూడా ఇటీవల ట్రంప్ తో భేటీ అయ్యారు.

సావిత్రిబాయి పూలే ను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి

హెడ్మాస్టర్ మేరీ వర కుమారి
విశాలాంధ్ర ధర్మవరం;! సావిత్రిబాయి పూలే ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా నిలవాలని హెడ్మాస్టర్ మేరీ వర కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అనంతరం మహిళ టీచర్లు చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వేదిక పైకి పూజారి రమేష్ హెడ్మాస్టర్ ను మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఆహ్వానించి, వారిద్వారా మహిళ ఉపాధ్యాయురాల పాత్రను వారు వివరించడం జరిగింది. అనంతరం మహిళా ఉపాధ్యాయులు కూడా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను తెలుపుతూ, ఆమె చేసిన సేవలను కొనియాడారు. తదుపరి పాఠశాల విద్యార్థినీలు కూడా సావిత్రిబాయి చేసిన సేవలు గూర్చి మాట్లాడడం అందరిని ఆకట్టుకుంది. తదుపరి మహిళా ఉపాధ్యాయులందరినీ కూడా ఘనంగా సత్కరించారు. తదుపరి పాఠశాల హెడ్మాస్టర్ మేరీ వర కుమారి పురుష ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం పెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

మద్దతు ధరకు కందులు కొనుగోలు కొరకు నమోదు చేసుకోండి

వ్యవసాయ అధికారి ముస్తఫా
విశాలాంధ్ర ధర్మవరం:; మద్దతు ధరకు గాను కందులు కొనుగోలు కోసం రైతులు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని కునుతూరు, పోతుకుంట గ్రామాలలో పర్యటించి, రైతు సేవ కేంద్రాలలో కందుల నమోదు కార్యక్రమాన్ని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7,750 లేదా మార్కెట్ ధర ఏది ఎక్కువ అయితే ఆ ధరతో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా కందులు కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. కావున రైతులకు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని తాము సూచించడం జరిగిందని తెలిపారు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాసుబుక్కు, ఆధార్ లింక్ కలిగిన మొబైల్ నెంబర్ తీసుకొని రైతు సేవ కేంద్ర సిబ్బందిని సంప్రదించాలని వారు తెలిపారు.

మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు చెల్లించండి.. సిఐటియు నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వెంటనే జీతాలను చెల్లించాలని కోరుతూ సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జే వి. రమణ, కో కన్వీనర్ అయూబ్ కాన్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్,ఇంజనీరింగ్ కార్మిక సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు నాగరాజు, అనిల్ ,పారిశుద్ధ్య కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, ముకుంద ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గత 16 రోజుల సమ్మె కాలంలో ఒప్పంద జీవో కాపీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులకు పెర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

చేనేత సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు గైకొనండి..

ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్కు ధర్మవరంలోఘన సన్మాన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మిక సంఘం నాయకులు చేనేత సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ చేనేత సమస్యలను శాసనసభలోను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు సహకరించాలని తెలిపార.,ప్రధానంగా చేనేత సమస్యలైనా బడ్జెట్లో నిధులు కేటాయింపు, నేతన్న నేస్తం అమలు చేయాలని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వెంటనే అమలు చేయాలని తెలిపారు. చేనేతలకు ఒక లక్ష రూపాయలు రుణం ఇవ్వాలని,దరఖాస్తు చేసుకున్న అర్హులైన చేనేతలందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని, చేనేతలకు ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు.మర మగ్గాల్లో చేనేత రకాలు తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలని తదితర సమస్యలన్నిటిని చేనేత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులుగా తమరికి తెలుపుతూ, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చేనేత పరిశ్రమ పరిరక్షణకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. తదుపరి 2025 సంవత్సరపు క్యాలెండర్ కూడా విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుడగ వెంకట్ నారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు పోలా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు చెన్నంపల్లి శ్రీనివాసులు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో న్యాక్ బృంద పర్యటన

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 8, 9 తేదీలలో(రెండు రోజులపాటు) నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ బృందం పర్యటించనున్నది అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాక్ ప్రమాణాలతో కళాశాల అభివృద్ధిని , సంస్థాగత విలువల్ని పర్యవేక్షించి అవసరమైన పురోగతిని సూచించ నున్నారు అని తెలిపారు. కళాశాలలో వున్న మౌలిక వసతులు, బోధన, పరిశోధన వంటి అంశాలతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు , పూర్వ విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు అని తెలిపారు. సూచనలు చేయబోతున్న సందర్భంగా కళాశాలలో విద్య పూర్తీ చేసుకుని వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు , ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు , వారి తల్లితండ్రులు కళాశాలకు ఈనెల 8వతేది మధ్యాహ్నం హాజరు కావాలని తెలపడం జరిగిందన్నారు. ఈ కలయిక వల్ల కళాశాల అభివృద్ధికి దోహదపడటమే కాక విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభించేందుకు న్యాక్ గ్రేడ్ తోడ్పడుతుందని వారు తెలిపారు.

మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు ఒక వరము లాంటిది..

ఎన్డీఏ కార్యాలయ, మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం:; మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఒక వరంలా మారిందని ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో హరీష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ మంచి విద్య అధ్యాపకులు బోధించేలా కృషి చేయాలని వారు తెలిపారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రతినిధిగా తాను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరూ కూడా ఈ మధ్యన భోజన కార్యక్రమాన్ని వినియోగించుకొని తమ ఉజ్వల భవిష్యత్తును తీర్చుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ ఆదర్శ మహిళ పేరు పెట్టడం శుభసూచకమని తెలియజేశారు. అనంతరం హరీష్ బాబు తో పాటు ఎంఈఓ గోపాల్ నాయక్ విద్యార్థులకు స్వయంగా వడ్డించిన తర్వాత, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి, పాలెం జనార్ధన్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

వాలంటీర్లుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని న్యాయం చేయండి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులకి వాలంటీర్లు వినతులు
విశాలాంధ్ర విజయనగరం టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని ఎవ్వరిమీద రాజకీయ కక్షలు చూపబోమని వాగ్దానం చేసిన విషయం మరచిపోకుండా వాలంటీర్లుకి న్యాయం చేయాలని అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ గుర్తు చేశారు.
శనివారం ఉదయం విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ నేతృత్వంలో స్థానిక కూటమి నాయకులు వినతులు ఇవ్వాలని ఇచ్చిన పిలుపులో భాగంగా 49 వ డివిజన్ కార్పొరేటర్ కర్రోతు రాధామని, 50 వ డివిజన్ టిడిపి నాయకులుకి వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. ఆమె స్పందించి ఈ వినతి పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి వాలంటీర్లుకి న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా 2019 నుండి వాలంటీర్లుగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వాలంటీర్లుగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా ఎంతో కష్టపడి పనులు చేసారని అన్నారు. కరోనా విళయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారములోనికి వస్తే మా వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని, నెలకు 10 వేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని, వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారనీ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత కూడా వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తామని ఇచ్చిన హామీలకు మేమంతా కట్టుబడి వున్నామని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయులు మీడియా ద్వారా ప్రకటించారనీ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినా మేము రాజీనామాలు చేయలేదన్నారు. వీళ్ళు ఎవ్వరి రికమండిషన్లుతో ఉద్యోగాల్లో చేరలేదని విద్యార్హతలు బట్టి ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్నామని తెలిపారు. దయచేసి వాలంటీర్లు పై రాజకీయాలు పులమొద్దు అని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వము అధికారం చేపట్టి 7 నెలలు పూర్తి కావస్తున్నది కానీ ఇంత వరకు వాలంటీర్లుకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు. 2024 జూన్ నెల నుండి మాకు గౌరవ వేతనం కూడా చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాపితముగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన అందరి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తారని ఇచ్చిన మాట నిలబెట్టుకొని న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము అని తెలిపారు. వాలంటీర్లు సమస్యలను ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్ళి న్యాయం చేయమని కోరారు.ఈ కార్యక్రమంలో విజయనగరం 49, 50 డివిజన్ పరిధిలోని వాలంటీర్లు పాల్గొన్నారు.