Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

అత్యుత్తమ వృద్ధిని సాధించిన కేఎస్బీ

ముంబయి: కేఎస్బీ లిమిటెడ్‌ మూడవ త్రైమాసికంలో అత్యుత్తమ వృద్ధిని నమోదు చేసింది. జూలై 22 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు ్న ఈ త్రైమాసికంలో సాధించిన ఐఎన్‌ఆర్‌ 4,313 మిలియన్ల అమ్మకాల విలువ గత సంవత్సరం కంటే 17 శాతం పెరిగింది.్న 2022 3 త్రైమాసికాల్లో అమ్మకాల విలువ ఐఎన్‌ఆర్‌ 12,974 మిలియన్లు, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో దాదాపు 23 శాతం పెరిగింది.్న త్రైమాసికానికి 13 శాతం ఆర్వోఎస్‌ను సాధించింది. త్రైమాసిక పనితీరుపై కేఎస్బీ లిమిటెడ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఫరోఖ్‌ భతేనా మాట్లాడుతూ మేం మూడవ త్రైమాసికంలో 17 శాతం వార్షిక అమ్మకాల వృద్ధిని నమోదు చేశామని పేర్కొన్నారు. గత సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాల్లో సంచిత విక్రయాలలో 23 శాతం పెరుగుదలను నమోదు చేశామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img