హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద డయాగ్నొస్టిక్ లాబొరేటరీ చైన్లలో ఒకటైన `అపోలో డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్లో అత్యాధునిక అపోలో డయాగ్నోస్టిక్స్ గ్లోబల్ రిఫరెన్స్ ల్యాబ్ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మద్దతు కలిగిన ఈ ల్యాబ్, 3,000 కంటే ఎక్కువ పరీక్షల మెనూని అందిస్తున్నది. భారత్, ఆగ్నేయాసియా వ్యాప్తంగా తన సేవలను అందిస్తుంది. 30,000 చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ డయాగ్నోస్టిక్స్ కేంద్రం హైదరాబాద్ శివారులోని బాలానగర్ వద్ద ఏర్పాటైంది, దేశంలోనే ఇది అతిపెద్ద, అత్యంత అత్యాధునిక డయాగ్నొస్టిక్ ల్యాబ్లలో ఒకటి. మొత్తం అపోలో హాస్పిటల్స్ గ్రూప్, భారతదేశంలోని ఇతర ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, హాస్పిటల్స్ సాధారణ, ప్రత్యేక టెస్టింగ్ అవసరాలన్నింటినీ ఈ బి2బి ల్యాబ్ తీర్చనున్నది.అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్కింద ప్రత్యేక ఫార్మాట్లను కూడా నిర్వహిస్తుంది.