Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘ఆసుస్‌’ సరికొత్త గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ విడుదల

న్యూఢల్లీి: ఆసుస్‌ ఇండియా రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) తాజాగా తమ ఆసుస్‌ ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 17 పీసీలకు నూతన అప్‌గ్రేడ్స్‌ను జోడిరచి భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్పెషల్‌ ఎడిషన్‌ (ఎస్‌ఈ) విడుదల చేసినట్లు వెల్లడిరచింది. ఈ పీసీలలో అత్యున్నతమైన ఇంటెల్‌ 12వ తరపు కోర్‌ ఐ9 హెచ్‌ఎక్స్‌ సిరీస్‌ ప్రాసెసర్లు ఉన్నాయి. దీనిలో 65 వాట్‌ వరకూ టీడీపీ లెవల్స్‌, అత్యంత ఆకర్షణీయమైన 16 కోర్స్‌ కౌంట్‌, 24 త్రెడ్స్‌, 5గిగా హెర్ట్జ్‌ వరకూ వేగం పెంచగల సామర్థ్యం ఉండటం వల్ల ఎలాంటి సవాల్‌నైనా అధిగమించగలదు. ఈ ల్యాప్‌టాప్‌ను సాటిలేని పనితీరు, గేమ్‌ప్లేను అందించే రీతిలో తీర్చిదిద్దారు. తద్వారా గేమింగ్‌ ప్రియులు, ఈస్పోర్ట్స్‌ ప్లేయర్లు తమ పూర్తి సామర్థ్యంతో ఆటలాడవచ్చు. ఈ ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ స్కార్‌ 17 ఎస్‌ఈ లీనమయ్యే గేమ్‌ ప్లే అనుభవాలను మరో దశకు తీసుకువెళ్తాయి. ఈ ప్రత్యేక ఎడిషన్‌ ధరలు 3,59,990 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా ఇది లభ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img