హైదరాబాద్ : భారతదేశంలో ప్రముఖ సోలార్ పివి సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ కంపెనీలలో ఒకట్కెన ప్రీమియర్ ఎనర్జీస్ తమ నూతన అత్యాధునిక ఉత్పత్తి ప్లాంట్ను ఇ-సిటీ హైదరాబాద్లో ప్రారంభించింది. రూ. 483 కోట్ల పెట్టుబడితో ఈ నూతన ప్లాంట్ను నిర్మించారు. ఈ నూతన ప్లాంట్తో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ సెల్స్ మరియు మాడ్యూళ్ళ ఉత్పత్తిలో ఇప్పుడు భారతదేశంలోనే 2 వ అతిపెద్ద ప్లాంట్. నూతన ప్లాంటును తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు కె టి రామారావు అధికారికంగా ప్రారంభించారు.