హైదరాబాద్ : ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో దృఢమైన, వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేశామని దేశంలో మొదటి స్మార్ట్ఫోన్, స్మార్ట్ టివి ప్లేయర్ ఎంఐ ఇండియా ప్రకటించింది. కౌంటర్ పాయింట్ సంస్థ మే 2021 ట్రాకర్ ప్రకారం, కంపెనీ రూ.20 వేలు-రూ.45 వేల విభాగంలో విభాగంలో ది14% మార్కెట్ వాటాను కైవసం చేసుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న, ప్రముఖ ప్రీమియం స్మార్ట్ఫోన్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. ఎంఐ 10ఐ, ఎంఐ11ఎక్స్, ఎంఐ11ఎక్స్ ప్రో వంటి స్మార్ట్ఫోన్లతో స్పష్టమైన ఉత్పత్తుల శ్రేణి భారతదేశంలో ఎంఐ బ్రాండ్ వృద్ధికి చక్కని బాటలు వేసింది. ప్రీమియం విభాగంలో ఎంఐ ఇండియా మార్కెట్ వాటా అభివృద్ధి చెందడం ఎంఐ ఫ్యాన్స్, వినియోగదారులు బ్రాండ్ పట్ల చూపిన నమ్మకానికి నిదర్శనమని చెప్పవచ్చు. ఒక ఏడాది వ్యవధిలో,కంపెనీ మార్కెట్ వాటా అక్టోబర్ 2020లో 3 శాతం ఉండగా, మే 2021లో ది14 శాతానికి చేరుకుందని ఎంఐ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ అన్నారు