ముంబయి: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ షవోమీ ఇండియా తాజాగా షవోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి అత్యుత్తమ ‘5జి ప్లస్’ నెట్వర్క్ను తీసుకు వచ్చేందుకు భారతీ ఎయిర్టెల్తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు వేగవంతమైన వీడియో కాలింగ్, క్లౌడ్లో లాగ్ ఫ్రీ గేమింగ్, అన్ని షవోమీ, రెడ్మి 5జి మోడళ్లలో వేగంగా డేటా అప్లోడ్, డౌన్లోడ్లను ఆస్వాదించవచ్చు. అల్ట్రాఫాస్ట్ ఎయిర్టెల్ 5జి ప్లస్ కనెక్టివిటీని పొందేందుకు వినియోగదారులు కేవలం నెట్వర్క్ సెట్టింగ్లకు వెళ్లి, తమ ప్రాధాన్యత నెట్వర్క్ను ఎయిర్టెల్ 5జికి మార్చుకోవాలి.