హైదరాబాద్ : భారతదేశ అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటైన ఐఐఎఫ్ఎల్ 2021 సెప్టెంబర్ 15 నుంచి ‘గోల్డ్ లోన్ మేళా’ను ప్రారంభించింది. దీని కింద కొత్త కస్టమర్లు అంతా కూడా గోల్డ్ రుణాలపై కచ్చితమైన బహుమ తులు పొందుతారు. ఈ స్కీమ్ నెలకు 0.79 % వడ్డీ రేటు మొదలుకొని ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అంది స్తోంది. ఐదు నిమిషాల్లో వేగంగా రుణ ప్రక్రియ పూర్తి అవుతుంది. బంగారంపై గరిష్ఠ రుణ విలువను పొందవ చ్చు. సులభమైన డిజిటల్ చెల్లింపు ఆప్షన్లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని 290 ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ శాఖల్లో ఈ ఆఫర్ లభ్యమవుతుందని జోనల్ హెడ్ శ్రీ శ్రీకాంత్ రేమల అన్నారు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ తన అనుబంధ సంస్థల ద్వారా వివిధ రకాల ఉత్పాదనలను అందిస్తోంది.