ముంబయి: కస్టమర్ సర్వీస్, అనుభవాన్ని పెంచడానికి తన ప్రయత్నాలకు అనుగుణంగా, ఒక ప్రాపంచిక స్మార్ట్ ఉపకరణ బ్రాండ్ ఒప్పో ఇండియా, తన సర్వీస్ సెంటర్లు 3.0ని ప్రారంభించింది. ప్రతి విషయములోనూ టెక్నాలజీ మూలబిందువుగా ఉండాలని కాంక్షిస్తూ అన్ని టచ్ పాయింట్లలోనూ ఒక ఉత్తమమైన అనుభవం కోసం ఎదురు చూసే ఆధునిక, యువ కస్టమర్కు ఈ కొత్త తరం సెంటర్లు ప్రత్యేకంగా రూపకల్పన చేయబడ్డాయి. బ్రాండు విశ్వసనీయత, పారదర్శకతను ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంతో, సరికొత్త ఒప్పో 3.0 సర్వీస్ సెంటర్లకు వచ్చే కస్టమర్లు ఇప్పుడు ఉత్పాదన ప్రదర్శనలు, ఇంకా చేతిలో ఉంచుకునే ఉపకరణాల మరమ్మత్తు, సర్వీసును ప్రత్యక్షంగా చూడగలుగుతారు. ఇది అన్ని భాగాల భద్రతను నిర్ధారిస్తుంది, తద్వారా డేటా భద్రతకు భరోసా ఇస్తుందని ఒప్పో ఇండియా కస్టమర్ సర్వీస్ ముఖ్యుడు సౌరభ్ చతుర్వేది తెలిపారు.