Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ వ్యాపారంలో పురోగతి

హైదరాబాద్‌ : 2021 జూన్‌ 30 నాటికి మొత్తం వ్యాపారం 1,16,713 కోట్ల రూపాయలుగా నిలువడంతో పాటుగా గత సంవత్సంతో పోలిస్తే 7.4% వృద్ధిని నమోదు చేసి 8,031 కోట్ల రూపాయల అదనపు ఆదాయం ఆర్జించింది. గత సంవత్సరం జూన్‌ 30 నాటికి 1,08,682 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. మార్చి 31, 2021 నాటి 1,16,098 కోట్ల రూపాయల స్ధాయి నుంచి మొదటి త్రైమాసంలో వ్యాపారం 651 కోట్ల రూపాయలు వృద్ధి చెందింది. గత సంవత్సరంతో పోలిస్తే క్రెడిట్‌ పోర్ట్‌ఫోలియో 8% (3,698 కోట్లరూపాయలు) వృద్ధి చెందింది. అడ్వాన్స్‌లు జూన్‌ 30, 2021 నాటికి 52,315 కోట్ల రూపాయలుగా నిలిచాయి. తద్వారా సంవత్సరం క్రితం నమోదు చేసిన 48,617 కోట్ల రూపాయలు (100 కోట్ల రూపాయల ఐబీపీసీతో సహా) నుంచి ఇది వృద్ధి చెందింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img