న్యూఢల్లీి: దేశంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, తమ ప్రసిద్ధి చెందిన ఎస్యూవీ కియా సెల్టోస్ను భారతదేశపు మార్కెట్లోకి విడుదల చేసింది, అది ఇప్పుడు తన శ్రేణిలో అన్ని వేరియెంట్స్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ను స్టాండర్డ్గా పొందే మొదటి కారుగా మారింది. కారులో ప్రయాణించే వారికి గొప్ప భద్రతను చేకూరుస్తోంది. కియా సెల్టోస్తో పాటు, స్టాండర్డ్ ఫిట్మెంట్గా ఆరు బ్యాగ్స్ కూడా కియా కారెన్స్లో అందించబడి, ఈ ముఖ్యమైన భద్రతా ఫీచర్ను స్టాండర్డ్గా అందించే ఏకైక మాస్ శ్రేణి తయారీదారుగా కియా ఇండియాను తయారు చేసింది. సెల్టోస్లో ఆరు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ అందించాలని నిర్ణయం తమ కస్టమర్స్ కు ఉత్తమమైన ప్రోడక్ట్స్ ను అందించాలని, భద్రతపై పెరిగిన ప్రాధాన్యాతను అనుసరించడంలో కియా నిబద్ధతను తెలియచేస్తోందని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ హర్దీప్ సింగ్ బ్రార్ చెప్పారు.