హైదరాబాద్ : భారతీయ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘కూ’లో చేరిన నటి కృతి సనన్, వారంలోనే 20,000 మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ బాలీవుడ్ నటి ‘ఎట్ కృతిసనన్’ అనే హ్యాండిల్తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స్నేహితుడు, స్టార్ నటుడు టైగర్ ష్రాఫ్ భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారం లో చేరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చి, వారి నుంచి ఘనమైన స్వాగతం పొందారు. కృతి చేరిన వెంటనే తన ఫ్యాన్ క్లబ్స్ కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు.