హైదరాబాద్ : ప్రీమియం కార్ల ప్రముఖ తయారీదారుహోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్) దేశంలో భారీగా ఉత్పత్తిని ఆరంభించింది. తమ ప్రసిద్ధి చెందిన కుటుంబ సిడాన్ న్యూ హోండా అమేజ్ని రాజస్థాన్లోని తపుకరాలో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి పంపిణీ చేసింది. కొత్త అమేజ్ ఆగస్ట్ 18న ప్రారంభమవుతుంది. తమ తయారీ ప్లాంట్ లో విజయవంతంగా ఉత్పత్తి స్థాయిని పెంచి అన్ని మోడల్స్ కోసం సరఫరాల్ని అందుబాటులోకి తెచ్చిన తరువాత ఆరంభించే సమయం నుండి నెట్వర్క్లో కార్ల లభ్యతని నిర్థారించడానికి కొత్త అమేజ్ భారీ ఉత్పత్తి, పంపిణీలు ఆరంభించినట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ అన్నారు, కంపెనీ ఇటీవల కొత్త అమేజ్ ప్రీ-లాంచ్ బుకింగ్స్ని ఆరంభించింది,