బెంగళూరు: తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్తో బెంగళూరు నగరంలో 921 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం ఒక డెఫినిటివ్ ఒప్పందంపై బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) సంతకం చేసినట్లు భారతదేశంలోని అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా, టీఎంఎల్ స్మార్ట్ సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ లిమిటెడ్ 12 సంవత్సరాల కాలానికి 921 యూనిట్ల 12 మీటర్ల లో-ఫ్లోర్ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తుంది, ఆపరేట్ చేస్తుంది, నిర్వహిస్తుంది. టాటా స్టార్బస్ ఎలక్ట్రిక్ అనేది సుస్థిరమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి అత్యుత్తమ డిజైన్,అత్యుత్తమ-తరగతి ఫీచర్లతో దేశీయంగా అభివృద్ధి చేయబడిన వాహనం.