తిరుపతి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో తమ మొదటి శాఖ ను ప్రారంభించినట్లు వెల్లడిరచింది. ఈ శాఖలో నూతన తరపు బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను సందర్శించే భక్తులకు అందించనుంది. ఈ శాఖను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐడీఈఎస్ ఏ వీ ధర్మారెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఆధ్యాత్మిక పట్టణం తిరుమల. ఈ నూతన శాఖ తెరువడం ద్వారా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శాఖల సంఖ్య ఇప్పుడు తిరుపతి జిల్లాలో 12 కు చేరింది. ఈ బ్యాంకుకు ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 139 నగరాల్లో 262 శాఖలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ హెడ్ తరుణ్ చౌదరి చెప్పారు. తిరుమలో తమ మొదటి శాఖ పలు ప్రపంచ శ్రేణి బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను అందిస్తుందన్నారు.