హైదరాబాద్ : ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్), పీఎల్ఆర్ చాంబర్స్ సంయుక్తంగా ఓ నివేదికను ‘భారతదేశంలో మద్యపానీయ రంగాల నియంత్రణ కోసం మౌలికసూత్రాల అభివృద్ధి’ శీర్షికన విడుదల చేసింది. ఈ నివేదికను ఐసీఆర్ఐఈఆర్ ఛైర్పర్సన్ ప్రమోద్ భాసిన్ విడుదల చేశారు. అనంతరం ‘భారతదేశంలో వ్యాపారాలను చేయడం ః నియంత్రణ మరియు ఆల్కహాలిక్ పానీయాల ధరలు’ అనే అంశంపై చర్చాకార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 40 శాతం మేరకు లిక్కర్ ఆదాయం పెరిగినట్లు ఈ నివేదిక వెల్లడిరచింది. ఈ చర్చా కార్యక్రమానికి మోడరేటర్గా పీఎల్ఆర్ చాంబర్స్ మేనేజింగ్ పార్టనర్ సుహాన్ ముఖర్జీ వ్యవహరించారు