న్యూఢల్లీి: కోకా-కోలా ఇండియా బిలియన్ డాలర్ స్వదేశీ బ్రాండు థమ్స్ అప్ భారతదేశం యొక్క 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఒక కొత్త క్యాంపెయిన్కి తెరలేపింది. హర్హాథ్తూఫాన్ పేరుతో చేపట్టిన ఈ క్యాంపెయిన్ అనేక సంవత్సరాల పాటు భారతదేశ నిర్మాణానికి తమ స్వహస్తాలతో కృషి చేసి – మన జాతి ప్రతిష్టకు నిజమైన దీప స్థంభాలై వెలుగొందిన స్ఫూర్తిదాయకులైన వ్యక్తులను ఘనంగా శ్లాఘిస్తుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా బ్రాండు, తమ మార్గానికి అడ్డుగా నిలిచిన ఆటంకాలన్నింటినీ అధిగమించి ధైర్యసాహసాలు, మొక్కవోని పట్టుదల, నిలకడైన శక్తిని చూపిన వారి ధీరోదాత్తతను సంబరంగా జరుపుకుంటుంది.