హైదరాబాద్ : అగ్రగామి గ్లోబల్ స్మార్ట్ డివైజ్ బ్రాండ్ ఒప్పో 2022 నాటికి 600ప్లస్ స్టోర్ల సర్వీస్ సెంటర్ల నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ ప్రస్తుతం 500ప్లస్ సేవా కేంద్రాలను 500పైగా నగరాల్లో విస్తరించి ఉండగా, అది బ్రాండ్ ఉత్పత్తుల విక్రయ అనంతర సేవల్లో బ్రాండ్ అగ్రగామి అనుభవానికి వెన్నెముకగా ఉంది. అత్యున్నత నాణ్యత సేవలను అందించేందుకు ఈ బ్రాండ్ తన విక్రయ అనంత సేవల నెట్వర్క్ను కుడల్, మోడాసా, నంగల్, ఉధంపూర్, మయిలాదుథురై, ధర్మపురి, హింగోలి, తూత్తుపుడి జిల్లాలకు కూడా విస్తరించినట్లు ఒప్పో ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమ్యంత్ సింగ్ ఖనోరియా తెలిపారు.