విశాలాంధ్ర/నిజామాబాద్: దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు డాక్టర్లు, ఐఐటీయన్లుగా మారాలనే కలను సాకారం చేయాలనే తమ లక్ష్యానికనుగుణంగా, దేశంలో టెస్ట్ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్ బైజూస్ మంగళవారం తమ నూతన క్లాస్రూమ్ సెంటర్ను తెలంగాణాలోని నిజామాబాద్లో ప్రారంభించింది. ఈ నూతన కేంద్రంలో 9 తరగతి గదులు ఉంటాయి. ఇవి 472 మంది విద్యార్థులకు తగిన సౌకార్యలను అందించగలవు. ఈ ఆకాష్ బైజూస్ కేంద్రం ఇంటి నెంబర్ 1-12-48, హనుమాన్ దేవాలయం వద్ద, వినాయక్ నగర్ చిరునామాలో ఉంది. ఈ క్లాస్రూమ్ కేంద్రం, వైద, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధుల అవసరాలను తీర్చనుంది. త్వరలోనే ఫౌండేషన్ స్థాయి కోర్సుల ను సైతం ప్రారంభించనున్నట్లు ఆకాష్Gబైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి తెలిపారు.