హైదరాబాద్ : ప్రముఖ పిజ్జా బ్రాండ్ పిజ్జా హట్ తాజాగా దేశంలో తన 500వ స్టోర్ మైలురాయిని ప్రారంభించినట్లు ప్రకటిం చింది. పిజ్జా హట్ 500వ స్టోర్ పంజాబ్లోని మోగాలో నటుడు, పరోపకారి సోనుసూద్ ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో భారతదేశంలో వారి అడుగు జాడలను గణనీయంగా పెంచే ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలు ఉన్నాయని కంపెనీ పంచుకుంది. పిజ్జా హట్ స్థిరమైన వృద్ధి పథంలో ఉంది. మెట్రోలతో పాటు టైర్ -2, టైర్ -3 నగరాల్లో తన ఉనికిని విస్తరించడానికి 2021 చివరి నాటికి కొత్త నగరాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.