ముంబయి: పెట్రోనాస్ లూబ్రికెంట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ (పీఎల్ఐపీఎల్), టాటా మోటార్స్ ఇవాళ సరికొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మేరకు అంగీకార ఒప్పంద కార్యక్రమంలో పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇకనుంచి టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాలకు లూబ్రికెంట్స్ వ్యూహాత్మక భాగస్వామిగా మారిందని ప్రకటించారు. రెండు కీలక దిగ్గజ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించే కార్యక్రమంలో ఆసియా పెట్రోనాస్ లూబ్రికెంట్స్ ఇంటర్నేషనల్ రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ గియుసేప్ పెడ్రెట్టి మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యంతో పీఎల్ఐ, టాటా మోటార్స్ రెండూ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యం రెండు సంస్థల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని పీఎల్ఐపీఎల్ సీఈఓ ప్రణవ్ భానాగే అన్నారు.