హైదరాబాద్ : డిటిడిసి, దాని వ్యూహాత్మక భాగస్వామి ఫ్రాన్స్కు చెందిన లీ గ్రూప్ లా పోస్టే యాజమాన్యంలోని జియోపోస్ట్ ఎస్ఏ (డిపిడి గ్రూప్)తో కలిసి జ్కెపూర్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో భాగంగా నారాయణ హృదయాలయ ఛారిటబుల్ ట్రస్ట్, నారాయణ హృదయాలయ లిమిటెడ్తో విజయవంతంగా భాగస్వామ్యం వహిస్తున్నది. డిటిడిసి, నారాయణ హెల్త్కు చెందిన ఉన్నత అధికారుల సమక్షంలో డిటిడిసి ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుభాషిష్ చక్రవర్తి ఆత్యుత్తమమైన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. జైపూర్లోని నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన ఈ ఉమ్మడి కార్యక్రమం ద్వారా కోవిడ్ మహమ్మారిపై ప్రస్తుతం కొనసాగుతున్న పోరాడటంలో దేశానికి సహాయపడటానికి సంసిద్ధంగా ఉన్నదని డిటిడిసి ఎక్స్ప్రెస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాషిష్ చక్రవర్తి తెలిపారు.