బెంగళూరు : బోష్ పవర్ టూల్స్ అధికారికంగా ‘ద అఫర్డబిలిటీ క్యాంపెయిన్’ను భారతదేశంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మొత్తమ్మీద తమ ఉపకరణాల యాజమాన్య నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గించనున్నారు. కీలకమైన విడిభాగాల ధరలను విభిన్నమైన ఉపకరణాల వ్యాప్తంగా సవరించనుండటం ద్వారా నాణ్యమైన మరియు అందుబాటు ధరలలో మరమ్మత్తులను తమ వినియోగదారులకు అందించనున్నారు. మహమ్మారి పరిస్థితులతో దేశం తమ పోరాటం కొనసాగిస్తున్న వేళ, బోష్ పవర్ టూల్స్ అసాధారణ డిమాండ్ను 2020 రెండవ త్రైమాసంలో చూసింది. బోష్ మొట్టమొదటిసారిగా అఫర్డబల్ టూల్స్ను 2016-17 సంవత్సరంలో ఆరంభించింది. తద్వారా వాణిజ్య వ్యాపారులకు తొలి పెట్టుబడుల భారం తగ్గించడం లక్ష్యంగా చేసుకుంది